ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో జూలై 11, శనివారం ఉదయం 10 గంటల వరకు రాష్ట్రంలో మొత్తం కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 27235 కి చేరుకుంది. అలాగే జూలై 11 నాటికి రాష్ట్రంలో 11,36, 225 శాంపిల్స్ పరీక్షించారు. ఈ నేపథ్యంలో కరోనా లక్షణాలు, అనుమానం కలిగిన వారు, అలాగే స్వచ్చందంగా సంప్రదించాలనుకునే వారి కోసం ఏపీ ప్రభుత్వం కొన్ని విధానాలను ప్రకటించింది.
ఏపీలో కరోనా టెస్టు చేయించుకోవాలంటే:
- కరోనా లక్షణాలు ఉన్నట్లయితే “COVID-19 AP” యాప్ లో వివరాలు పొందుపరిచి వెంటనే కరోనా పరీక్ష కోసం కోరవచ్చు. అన్ని ప్రభుత్వ కేంద్రాల్లో కరోనా వైద్య పరీక్షలను పూర్తిగా ఉచితంగా నిర్వహిస్తున్నారు.
- అలాగే రాష్ట్రంలో కరోనా టెస్టు చేయించుకోవాలి అనుకుంటే covid-andhrapradesh.verahealthcare.com లింక్ ను ఓపెన్ చేసి వివరాలు నమోదు చేసుకోవాలి. అనంతరం సంబంధిత అధికారులు సంప్రదించి, ఇంటివద్దకే వచ్చి పరీక్ష కోసం శాంపిల్ సేకరించి, ఫలితాన్ని వెల్లడిస్తారు.
మీకు #COVID19 లక్షణాలు ఉన్నట్లయితే COVID-19 AP యాప్ లో మీ వివరాలు పొందుపరిచి వెంటనే #COVID పరీక్ష కోసం కోరండి. అన్ని ప్రభుత్వ కేంద్రాల్లో కోవిడ్ పరీక్ష పూర్తిగా ఉచితం.https://t.co/YyqSNipdOE #APFightsCorona #COVID19Pandemic pic.twitter.com/FjKFt1E4gD
— ArogyaAndhra (@ArogyaAndhra) July 7, 2020
ఆంధ్ర ప్రదేశ్ లో ఎవరైనా కరోనా టెస్టు చేయించుకోవాలి అనుకుంటే….
ఈ లింక్ ఓపెన్ చేసి…..
మీ వివరాలు నమోదు చేసుకోండి….
సంబంధిత అధికారులు మిమ్మల్ని సంప్రదిస్తారు……https://t.co/80NQxSFLZD
— Gopal Krishna Dwivedi (@gkd600) July 11, 2020
మ్యాంగో న్యూస్ యాప్ లింక్స్:
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJu