ఆంధ్రప్రదేశ్ లో కరోనా కేసులు భారీగా నమోదయ్యాయి. మంగళవారం ఉదయం 9 గంటల నుంచి బుధవారం ఉదయం 9 గంటల వరకు రాష్ట్రంలో 41,713 శాంపిల్స్ కు పరీక్షలు నిర్వహించగా 10,057 మందికి పాజిటివ్ గా నిర్ధారణ అయినట్టు పేర్కొన్నారు. కొత్తగా నమోదైన కేసుల్లో అత్యధికంగా విశాఖపట్నం జిల్లాలో 1827, చిత్తూరులో 1822, గుంటూరులో 943, తూర్పుగోదావరిలో 919, అనంతపూర్ లో 861, ప్రకాశంలో 716 నమోదయ్యాయి. దీంతో రాష్ట్రంలో మొత్తం కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 20,92,227 కు చేరుకుంది.
ఇక కరోనా వలన కొత్తగా విశాఖపట్నంలో ముగ్గురు, చిత్తూరు, గుంటూరు, నెల్లూరు, శ్రీకాకుళం మరియు విజయనగరం జిల్లాల్లో ఒక్కొక్కరి చొప్పున మరణించారు. దీంతో మొత్తం కరోనా మరణాల సంఖ్య 14522 కు చేరింది. గత 24 గంటల్లో 1,222 మంది కరోనా నుంచి కోలుకోవడంతో ఇప్పటివరకు రికవరీ అయినవారి సంఖ్య 20,67,984 కు చేరుకుంది. ప్రస్తుతం రాష్ట్రంలో 44,935 యాక్టీవ్ కేసులు ఉన్నాయి. మరోవైపు రాష్ట్రంలో ఇప్పటివరకు మొత్తం 3,19,64,682 కరోనా పరీక్షలు నిర్వహించారు.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYF