ఆంధ్రప్రదేశ్ లో గతకొన్ని రోజులుగా పెద్దసంఖ్యలో కరోనా కేసులు నమోదవుతున్నాయి. రాష్ట్రంలో మరో 1813 కరోనా పాజిటివ్ కేసులు నమోదుకాగా, వీటిలో 1775 మంది స్థానికులు, ఇతర రాష్ట్రాల నుంచి వచ్చిన వారు 34, విదేశాల నుంచి వచ్చిన వారు నలుగురు ఉన్నారు. కొత్తగా నమోదైన 1813 కేసులతో కలిపి జూలై 11, శనివారం ఉదయం 10 గంటల వరకు రాష్ట్రంలో మొత్తం కేసుల సంఖ్య 27235 కు చేరింది. గత 24 గంటల్లో 20,590 శాంపిల్స్ పరీక్షించినట్టుగా తెలిపారు. మరోవైపు కరోనా వలన కర్నూల్ లో నలుగురు, గుంటూరులో ముగ్గురు, విజయనగరంలో ముగ్గురు, కృష్ణాలో ఇద్దరు, నెల్లూరులో ఇద్దరు, అనంతపూర్ లో ఒకరు, కడపలో ఒకరు, విశాఖపట్నంలో ఒకరు మరణించడంతో రాష్ట్రంలో మొత్తం మరణాల సంఖ్య 309 కి చేరింది.
ఏపీలో కరోనా కేసులు వివరాలు (జూలై 11, ఉదయం 10 గంటల వరకు) :
- రాష్ట్రంలో మొత్తం పాజిటివ్ కేసులు : 27235
- కొత్తగా నమోదైన కేసులు : 1813
- నమోదైన మరణాలు : 17
- డిశ్చార్జ్ అయిన వారి మొత్తం సంఖ్య : 14393
- యాక్టీవ్ కేసులు : 12533
- మొత్తం మరణాల సంఖ్య : 309
మ్యాంగో న్యూస్ యాప్ లింక్స్:
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJu