రాష్ట్రంలో కరోనా పాజిటివ్ కేసులు పెరుగుతుండడంతో ఒడిశా ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. రాష్ట్రంలోని అన్ని కంటైన్మెంట్ జోన్లలో కరోనా వైరస్ లాక్డౌన్ ను నవంబర్ 30 వరకు పొడిగించినట్టు నవీన్ పట్నాయక్ నేతృత్వంలోని ఒడిశా ప్రభుత్వం ప్రకటించింది. అలాగే ఇటీవలే నవంబర్ 30 వరకు రాష్ట్రంలోని అన్ని రకాల విద్యాసంస్థలను మూసే ఉంచాలని ఆదేశాలు ఇచ్చారు. అయినప్పటికీ నవంబర్ 16 నుండి 9 నుంచి ఇంటర్ విద్యార్థులకు పాఠశాలల పర్యవేక్షణలో తరగతులు నిర్వహించుకునేందుకు అనుమతి ఇచ్చారు. మరోవైపు ఒడిశాలో మొత్తం కరోనా పాజిటివ్ కేసుల 2,90,116 సంఖ్య కు చేరుకోగా, 2,73,838 మంది కరోనా నుంచి కోలుకున్నారు. ఇక కరోనా వైరస్ కారణంగా ఒడిశాలో ఇప్పటికి 1,373 మంది మరణించారు.
మ్యాంగో న్యూస్ యాప్ లింక్స్:
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ