ఏపీలో కొత్తగా 675 కరోనా పాజిటివ్ కేసులు, 3 మరణాలు నమోదు

Covid-19 in AP : 675 New Positive Cases and 3 Deaths Reported in Last 24 Hours

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కరోనా కేసుల నమోదు తగ్గుముఖం పట్టింది. ఈ నేపథ్యంలో మంగళవారం ఉదయం 9 గంటల నుంచి బుధవారం ఉదయం 9 గంటల వరకు రాష్ట్రంలో 24,663 శాంపిల్స్ కు పరీక్షలు నిర్వహించగా 675 మందికి పాజిటివ్ గా నిర్ధారణ అయినట్టు పేర్కొన్నారు. కొత్తగా నమోదైన కరోనా కేసుల్లో అత్యధికంగా తూర్పు గోదావరి జిల్లాలో 143, పశ్చిమగోదావరిలో 130, చిత్తూరులో 68, కృష్ణాలో 64, విశాఖపట్నంలో 57, గుంటూరులో 55 నమోదయ్యాయి. దీంతో రాష్ట్రంలో మొత్తం కరోనా పాజిటివ్‌ కేసుల సంఖ్య 23,14,502 కు చేరుకుంది.

ఇక కరోనా వలన కొత్తగా చిత్తూరు, కృష్ణా, మరియు విశాఖపట్నం జిల్లాల్లో ఒక్కొక్కరి చొప్పున మరణించారు. దీంతో మొత్తం కరోనా మరణాల సంఖ్య 14705 కు చేరింది. గత 24 గంటల్లో 2,414 మంది కరోనా నుంచి కోలుకోవడంతో ఇప్పటివరకు రికవరీ అయినవారి సంఖ్య 22,88,989కు చేరుకుంది. ప్రస్తుతం రాష్ట్రంలో 10,808 యాక్టీవ్ కేసులు ఉన్నాయి. మరోవైపు రాష్ట్రంలో ఇప్పటివరకు మొత్తం 3,28,93,908 కరోనా పరీక్షలు నిర్వహించారు.

మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

four × 5 =