రాబోయే ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) సీజన్కు కోల్కతా నైట్ రైడర్స్ (కేకేఆర్) జట్టు కొత్త కెప్టెన్గా శ్రేయాస్ అయ్యర్ నియమితుడయ్యాడు. ఈ మేరకు కోల్కతా నైట్ రైడర్స్ జట్టు యాజమాన్యం బుధవారం ఒక ప్రకటన చేసింది. ఇటీవల జరిగిన ఐపీఎల్-2022 మెగా వేలంలో శ్రేయాస్ అయ్యర్ ను కోల్కతా రూ.12.25 కోట్లకు కొనుగోలు చేసిన సంగతి తెలిసిందే. గత సీజన్ లో కేకేఆర్ జట్టుకు ఇయాన్ మోర్గాన్ కెప్టెన్ గా వ్యవహరించగా ఇకపై శ్రేయాస్ అయ్యర్ ఆ బాధ్యతలు స్వీకరించనున్నాడు. శ్రేయాస్ ను వేలంలో విజయవంతంగా దక్కించుకున్నందుకు, కెప్టెన్ గా అవకాశం ఇచ్చేందుకు సంతోషిస్తున్నామని కేకేఆర్ సీఈఓ అండ్ ఎండీ వెంకీ మైసూర్ తెలిపారు. అతను బ్యాట్స్మెన్గా, కెప్టెన్ గా రాణిస్తాడనే నమ్మకముందని అన్నారు.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ