ఆంధ్రప్రదేశ్ లో కరోనా వైరస్ తీవ్రత కొనసాగుతుంది. రాష్ట్రంలో కొత్తగా 7293 పాజిటివ్ కేసులు, 57 మరణాలు నమోదు అయ్యాయి. దీంతో సెప్టెంబర్ 26, శనివారం ఉదయం 10 గంటల వరకు మొత్తం పాజిటివ్ కేసుల సంఖ్య 6,68,751 కు చేరగా, కరోనా వలన మరణించిన వారి సంఖ్య 5663 కి పెరిగింది. మరో 9125 మంది కరోనా నుంచి కోలుకుని సంపూర్ణ ఆరోగ్యంతో డిశ్చార్జ్ చేయబడ్డారని తెలిపారు. కాగా గడిచిన 24 గంటల్లో 75,990 శాంపిల్స్ కు పరీక్షలు నిర్వహించారు.
కరోనా వలన ప్రకాశంలో పది మంది, చిత్తూరులో ఎనిమిది మంది, కడపలో ఎనిమిది మంది, కృష్ణాలో ఆరుగురు, విశాఖపట్నంలో ఐదుగురు, తూర్పుగోదావరిలో నలుగురు, పశ్చిమగోదావరిలో నలుగురు, గుంటూరులో ముగ్గురు, నెల్లూరులో ముగ్గురు, అనంతపూర్ లో ఇద్దరు, శ్రీకాకుళంలో ఇద్దరు, కర్నూల్ లో ఒకరు, విజయనగరంలో ఒక్కరు మరణించారు. దీంతో రాష్ట్రంలో మొత్తం మరణాల సంఖ్య 5663 కి చేరింది.
ఏపీలో కరోనా కేసులు వివరాలు (సెప్టెంబర్ 26, ఉదయం 10 గంటల వరకు) :
- రాష్ట్రంలో నిర్వహించిన మొత్తం పరీక్షలు: 55,23,786
- రాష్ట్రంలో మొత్తం పాజిటివ్ కేసులు : 6,68,751
- కొత్తగా నమోదైనా కేసులు : 7293
- నమోదైన మరణాలు : 57
- డిశ్చార్జ్ అయిన వారి మొత్తం సంఖ్య : 5,97,294
- యాక్టీవ్ కేసులు : 65794
- మొత్తం మరణాల సంఖ్య : 5663
మ్యాంగో న్యూస్ యాప్ లింక్స్:
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJu