ప్రతిష్టాత్మక యాషెస్ సిరీస్లో ఆస్ట్రేలియా అదరగొడుతోంది. అడిలైడ్లో జరిగిన రెండవ టెస్టులో ఆస్ట్రేలియా 275 పరుగుల తేడాతో ఇంగ్లండ్ను చిత్తు చేసింది. దీంతో ఐదు మ్యాచ్ల సిరీస్లో ఆధిక్యాన్ని 2-0కు పెంచుకుంది. మార్నస్ లబుషేన్ ‘ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్’గా నిలిచాడు. ఈ మ్యాచ్ లో సెంచరీ సాధించటంతో పాటు లబుషేన్ మొత్తంగా 154 పరుగులు సాధించాడు. ఆస్ట్రేలియా బౌలర్ రిచర్డ్సన్ ఐదు వికెట్ల ప్రదర్శన చేసాడు. యాషెస్ మొదటి టెస్టులో కూడా ఆసీస్ 9 వికెట్ల తేడాతో గెలుపొందిన సంగతి తెలిసిందే.
ఆస్ట్రేలియా కెప్టెన్ ప్యాట్ కమిన్స్ అడిలైడ్ టెస్టుకు దూరం అయ్యాడు. కరోనా లక్షణాలున్న వ్యక్తితో సన్నిహితంగా మెలిగిన కారణంగా కమిన్స్ జట్టుకు దూరం అయ్యాడు. దీంతో మాజీ సారథి స్టీవ్ స్మిత్ జట్టును ముందుండి నడిపించాడు. ఈ మ్యాచ్లో ఆది నుంచి ఆధిపత్యం కనబరిచిన కంగారూలు… ఎట్టకేలకు విజయం సాధించి ఇంగ్లండ్కు చేదు అనుభవం మిగిల్చారు. పర్యాటక జట్టులో డేవిడ్ మలన్, కెప్టెన్ జో రూట్ మాత్రమే చెప్పుకోదగ్గ స్కోర్లు చేశారు. ఇంగ్లండ్ బ్యాట్సమన్ జోస్ బట్లర్ 207 బంతులు ఎదుర్కొని కేవలం 26 పరుగులు చేశాడు. ఆస్ట్రేలియా బౌలర్ రిచర్డ్సన్ ఐదు వికెట్ల ప్రదర్శన చేయటంతో పాటు జట్టుకు ఘన విజయాన్ని అందించాడు. ఇది అతనికి తొలి ఐదు వికెట్ల ప్రదర్శన కావడం విశేషం.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ