ఆంధ్రప్రదేశ్ లో కరోనా కేసులు రోజురోజుకి పెద్ద సంఖ్యలో నమోదవుతున్నాయి. రాష్ట్రంలో కొత్తగా 837 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. వీటిలో 789 మంది రాష్ట్రంలో వారు కాగా, ఇతర రాష్ట్రాల నుంచి వచ్చిన వారు 46, విదేశాల నుంచి వచ్చిన వారు ఇద్దరు ఉన్నారు. కొత్తగా నమోదైన 837 కేసులతో కలిపి జూలై 3, శుక్రవారం ఉదయానికి రాష్ట్రంలో మొత్తం కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 16934 కు చేరింది. గత 24 గంటల్లో 38,898 శాంపిల్స్ పరీక్షించినట్టుగా తెలిపారు.
మరోవైపు కరోనా వలన కర్నూల్ లో నలుగురు, చిత్తూరులో ఇద్దరు, కృష్ణా లో ఒకరు, తూర్పుగోదావరిలో ఒకరు మరణించడంతో రాష్ట్రంలో మొత్తం మరణాల సంఖ్య 206 కి చేరింది. ఇక రాష్ట్రంలో మొత్తం నమోదైన కేసుల్లో ఇప్పటికే 7632 మంది కోలుకుని సంపూర్ణ ఆరోగ్యంతో డిశ్చార్జ్ చేయబడ్డారని తెలిపారు. ప్రస్తుతం రాష్ట్రంలో 7136 మంది ఆసుపత్రుల్లో, 1960 మంది కోవిడ్ కేర్ సెంటర్స్ లో మొత్తం 9096 మంది చికిత్స పొందుతున్నారు.
మ్యాంగో న్యూస్ యాప్ లింక్స్:
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJu