నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి.. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్కు మూడేళ్ల పాటు ముఖ్యమంత్రిగా వ్యవహరించారు. ఆ తర్వాత సమైక్యాంధ్ర నినాదంతో తన ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేశారు. కొన్నేళ్లుగా అజ్ఞాతంలోకి వెళ్లిన కిరణ్ కుమార్ రెడ్డి ఇటీవలే కాషాయపు కండువా కప్పుకున్నారు. అయితే ప్రస్తుతం కిరణ్ కుమార్ రెడ్డి పేరు ఏపీలో ఎక్కువగా వినిపిస్తోంది. ఇందుకు కారణం పార్టీ పగ్గాలు కిరణ్ కుమార్ రెడ్డికి అప్పగించాలని బీజేపీ హైకమాండ్ భావించడమే.
ఆరు నెలల క్రితమే బీజేపీ హైకమాండ్.. సోమువీర్రాజును పక్కన పెట్టి అధ్యక్షురాలుగా పురంధేశ్వరిని నియమించింది. ఆమెపై అధిష్టానం బోలెడన్ని ఆశలు పెట్టుకుంది. బలమైన సామాజీక వర్గానికి చెందిన నాయకురాలు కావడంతో పాటు ఆమెది ఎన్టీఆర్ బ్లడ్ కావడంతో అధిష్టానం పదవిని కట్టబెట్టింది. కానీ ప్రస్తుతం పురందేశ్వరి పట్ల అధిష్టానం నిరాశతో ఉన్నట్లు తెలుస్తోంది. పురందేశ్వరి బాధ్యతలు స్వీకరించాక.. ఇతర పార్టీల నుంచి భారీగా చేరికలు ఉంటాయని అధిష్టానం భావించింది. కానీ అమె వచ్చాక పార్టీలో ఉన్నవారే ఇతర పార్టీల్లోకి జంప్ అయ్యారు. అలాగే మరికొంత మంది జంప్ అయ్యేందుకు సిద్ధంగా ఉన్నారు.
ఈ పరిణామాల మధ్య ఇలానే ఎన్నికలకు వెళ్తే బెడిసి కొడుతుందని అధిష్టానం భావిస్తోంది. అందుకే పురంధేశ్వరిని అధ్యక్ష పదవి నుంచి తప్పించి.. నల్లారి కిరణ్ కుమార్ రెడ్డికి బాధ్యతలు అప్పగించాలని భావిస్తోంది. ఇప్పటికే బీజేపీ హైకమాండ్ ఈ అంశంపై కిరణ్ కుమార్ రెడ్డితో చర్చలు జరిపిందట. త్వరలోనే కిరణ్ కుమార్ రెడ్డి అధ్యక్ష బాధ్యతలు స్వీకరించనున్నట్లు విశ్వసనీయ వర్గాలు చెబుతున్నాయి. కిరణ్ కుమార్.. సీనియర్ నాయకుడు కావడమే కాకుండా.. బలమైన రెడ్డి సామాజిక వర్గానికి చెందినవారు కావడంతో పార్టీకి ఆదరణ పెరుగుతుందని హైకమాండ్ భావిస్తోంది. అలాగే ఇతర పార్టీల నుంచి నాయకులను తీసుకురాగల సత్తా కిరణ్ కుమార్ రెడ్డికి ఉందని నమ్ముతోంది.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xE