ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మరో 553 కరోనా వైరస్ పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. వీటిలో 477 రాష్ట్రంలో వారు కాగా, ఇతర రాష్ట్రాల నుంచి వచ్చిన వారు 69, విదేశాల నుంచి వచ్చిన వారు ఏడుగురు ఉన్నారు. కొత్తగా నమోదైన 553 కేసులతో కలిపి జూన్ 25, గురువారం ఉదయానికి రాష్ట్రంలో మొత్తం కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 10884 కు చేరింది. గత 24 గంటల్లో 19085 సాంపిల్స్ పరీక్షించినట్టుగా తెలిపారు. ఈ కేసుల్లో 8783 రాష్ట్రంలో నమోదుకాగా, ఇతర రాష్ట్రాల నుంచి వచ్చిన వారు మరియు విదేశాల నుండి వచ్చిన వారు 2101 మంది ఉన్నారు.
మరోవైపు కృష్ణాలో ఇద్దరు, కర్నూల్ లో ఇద్దరు, గుంటూరులో ఇద్దరు మరియు తూర్పుగోదావరిలో ఒకరు మరణించడంతో ఈ వైరస్ వలన రాష్ట్రంలో మరణించిన వారి సంఖ్య 136 కి చేరింది. ఇక రాష్ట్రంలో మొత్తం నమోదైన కేసుల్లో ఇప్పటికి 4988 మంది కోలుకుని సంపూర్ణ ఆరోగ్యంతో డిశ్చార్జ్ చేయబడ్డారని తెలిపారు. ప్రస్తుతం 5760 మంది చికిత్స పొందుతున్నారు.
ఏపీలో జిల్లాల వారీగా కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య:
- అనంతపూర్ – 1080
- చిత్తూరు – 699
- కర్నూల్ – 1555
- కడప – 500
- తూర్పుగోదావరి – 824
- పశ్చిమ గోదావరి – 681
- నెల్లూరు – 522
- ప్రకాశం – 218
- గుంటూరు – 958
- కృష్ణా – 1179
- శ్రీకాకుళం – 61
- విజయనగరం – 99
- విశాఖపట్నం – 407
- ఇతర రాష్ట్రాలనుంచి వచ్చిన వారు: 1730
- విదేశాల నుంచి వచ్చిన వారు: 371
మ్యాంగో న్యూస్ యాప్ లింక్స్:
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJu