భారత్ లో కరోనా వైరస్ మహమ్మారి విజృంభణ కొనసాగుతుంది. జూన్ 25, గురువారం ఉదయానికి దేశంలో కరోనా బాధితుల సంఖ్య 4,73,105 కు పెరిగిందని కేంద్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖ వెల్లడించింది. గత 24 గంటల్లోనే దేశవ్యాప్తంగా కొత్తగా 16922 కరోనా పాజిటివ్ కేసులు, 418 కరోనా మరణాలు నమోదయ్యాయి. దేశంలో కరోనా వ్యాప్తి చెందడం మొదలయ్యాక అత్యధికంగా ఒకేరోజున ఈ స్థాయిలో కేసులు నమోదవడం ఇదే తొలిసారి.
మరోవైపు దేశంలో కరోనా వైరస్ సోకి మరణించిన వారి సంఖ్య 14894 కి చేరింది. కరోనా బాధితుల్లో ఇప్పటివరకు 2,71,697 మంది పూర్తిస్థాయిలో కోలుకుని డిశ్చార్జ్ అవ్వగా, ప్రస్తుతం 1,86,514 మంది కరోనా లక్షణాలతో ఐసొలేషన్ వార్డుల్లో చికిత్స పొందుతున్నారు. దేశంలో ముఖ్యంగా మహారాష్ట్ర, తమిళ నాడు, గుజరాత్, ఢిల్లీ రాష్ట్రాల్లో కరోనా తీవ్రత ఎక్కువుగా ఉంది. మహారాష్ట్రలో కరోనా కేసులు 1,42,899 కు చేరగా, వీరిలో 73,792 మంది కోలుకున్నారు, 6739 మంది మరణించారు. మహారాష్ట్ర తర్వాత ఢిల్లీలో అత్యధికంగా 70,390, తమిళనాడులో 67,468, గుజరాత్ లో 29,001 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి.
దేశంలో 1000 కు పైగా కరోనా పాజిటివ్ కేసులు నమోదైన రాష్ట్రాలు:
- మహారాష్ట్ర – 1,42,899
- ఢిల్లీ – 70,390
- తమిళనాడు – 67,468
- గుజరాత్ – 29,001
- ఉత్తర ప్రదేశ్ – 19,557
- రాజస్థాన్ – 16,085
- పశ్చిమబెంగాల్ – 15,173
- మధ్యప్రదేశ్ – 12,448
- హర్యానా – 12,010
- తెలంగాణ – 10,444
- ఆంధ్రప్రదేశ్ – 10,331
- కర్ణాటక – 10,118
- బీహార్ – 8,273
- జమ్మూ కశ్మీర్ – 6,422
- అస్సాం – 6,371
- ఒడిశా – 5,962
- పంజాబ్ – 4,627
- కేరళ – 3,604
- ఉత్తరాఖండ్ – 2,623
- ఛత్తీస్ ఘడ్ – 2,419
- జార్ఖండ్ – 2,219
- త్రిపుర – 1,263
#CoronaVirusUpdates: #COVID19 India Tracker
(As on 25th June, 2020, 08:00 AM)▶️ Confirmed cases: 473,105
▶️ Active cases: 186,514
▶️ Cured/Discharged/Migrated: 271,697
▶️ Deaths: 14,894#IndiaFightsCorona#StayHome #StaySafe @ICMRDELHIVia @MoHFW_INDIA pic.twitter.com/EabBe2gnfz
— #IndiaFightsCorona (@COVIDNewsByMIB) June 25, 2020
మ్యాంగో న్యూస్ యాప్ లింక్స్:
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJu