ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో సోమవారం ఉదయం 10 గంటల వరకు మొత్తం కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 8,88,485 కు చేరుకుంది. గత 24 గంటల్లో 22094 శాంపిల్స్ కి పరీక్షలు నిర్వహించగా 62 మందికి కరోనా పాజిటివ్ గా నిర్ధారణ అయినట్టు తెలిపారు. రెండుజిల్లాల్లో ఎలాంటి కొత్త కేసులు నమోదవలేదు. తూర్పుగోదావరి జిల్లాలో 8, కర్నూల్ లో 5, కృష్ణాలో 10, కడపలో 9, గుంటూరులో 7, చిత్తూరులో 8, అనంతపూర్ లో 1, నెల్లూరులో 6, ప్రకాశంలో 1, శ్రీకాకుళంలో 2, విశాఖపట్నంలో 5, విజయనగరంలో 0, పశ్చిమగోదావరిలో 0 కేసులు నమోదయ్యాయి.
ఇక కొత్తగా కరోనా వలన విశాఖపట్నంలో ఒకరు మరణించారు. దీంతో రాష్ట్రంలో కరోనా మరణాల సంఖ్య 7160 కి పెరిగింది. మరోవైపు గడిచిన 24 గంటల్లో 102 మంది కోలుకోవడంతో, రికవరీ అయిన వారి మొత్తం సంఖ్య 8,80,363 కు చేరింది. అలాగే ప్రస్తుతం 962 మంది కరోనా బాధితులు చికిత్స పొందుతున్నారు. ఫిబ్రవరి 8 నాటికీ ఏపీలో మొత్తం 1,33,67,616 కరోనా పరీక్షలను నిర్వహించారు.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ