అన్ని రకాల అంతర్జాతీయ క్రికెట్ ఫార్మాట్లలో ఉత్తమ ప్రదర్శనలకు సంబంధించి అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ (ఐసీసీ) ఇటీవలే “ప్లేయర్ అఫ్ ది మంత్” అవార్డు ప్రవేశపెట్టిన సంగతి తెలిసిందే. మెన్ మరియు ఉమెన్ క్రికెటర్ల విభాగంలో ఈ అవార్డును అందజేస్తున్నారు. అందులో భాగంగా టీమిండియా ఆటగాడు రిషబ్ పంత్ ప్రారంభ ఐసీసీ మెన్స్ ప్లేయర్ ఆఫ్ ది మంత్ అవార్డును గెలుచుకున్నాడు. జనవరి, 2021 నెలకు గానూ రిషబ్ పంత్ ఈ అవార్డు దక్కించుకున్నాడు. ఓటింగ్లో జో రూట్ మరియు పాల్ స్టిర్లింగ్ కంటే రిషబ్ పంత్ ముందంజలో నిలిచాడు. ఆస్ట్రేలియాతో టెస్టు సిరీస్ సందర్భంగా నాలుగు ఇన్నింగ్స్ లలో 245 పరుగులు చేసి భారత్ విజయంలో రిషబ్ పంత్ కీలక పాత్ర పోషించాడు.
ఇక ప్రారంభ ఐసీసీ ఉమెన్స్ ప్లేయర్ ఆఫ్ ది మంత్ అవార్డును సౌత్ ఆఫ్రికా క్రికెట్ క్రీడాకారిణి షాబ్నిమ్ ఇస్మాయిల్ గెలుచుకున్నారు. డయానా బేగ్, మారిజాన్ కాప్ కంటే ముందంజలో నిలిచి ఈ అవార్డు దక్కించుకున్నారు. ఈ అవార్డులకు సంబంధించి ముందుగా పలుదేశాల మాజీ ఆటగాళ్ళు, ప్రసారకర్తలు మరియు ప్రపంచవ్యాప్తంగా ఉన్న జర్నలిస్టులతో కూడిన స్వతంత్ర ఐసీసీ ఓటింగ్ అకాడమీ అభిమానులతో కలిసి ఐసీసీ పురుషుల ప్లేయర్ ఆఫ్ ది మంత్ మరియు ఐసీసీ ఉమెన్స్ ప్లేయర్ ఆఫ్ ది మంత్ కోసం ఓటు వేసి ఎంపిక చేస్తారు.
Congratulations, @RishabhPant17! pic.twitter.com/5q8YxIS8P4
— ICC (@ICC) February 8, 2021
Congratulations to @OfficialCSA bowler, Shabnim Ismail! pic.twitter.com/VcUzkzzlGu
— ICC (@ICC) February 8, 2021
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ