ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా మే 9వ తేదీన ‘జగనన్నకు చెబుదాం’ కార్యక్రమాన్ని ప్రారంభిస్తున్నట్లు వెల్లడించారు ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి. ఈ మేరకు శుక్రవారం ‘స్పందన’పై సమీక్షలో భాగంగా ఆయన కీలక ప్రకటన చేశారు. తాడేపల్లిలోని సీఎం క్యాంపు కార్యాలయంలో నిర్వహించిన ఈ సమీక్షా సమావేశంలో అన్ని జిల్లాల కలెక్టర్లు, ఎస్పీలు వీడియో కాన్ఫరెన్స్ ద్వారా పాల్గొన్నారు. ఈ సందర్భంగా సీఎం జగన్ మాట్లాడుతూ.. మే 9వ తేదీన ‘జగనన్నకు చెబుదాం’ కార్యక్రమాన్ని ప్రారంభించనున్నామని, దీని కోసం 1902 హెల్ప్లైన్ నంబర్ను వినియోగంలోకి తీసుకు రావాలని నిర్ణయించారు. ఈ కార్యక్రమాన్ని ప్రతిష్టాత్మకంగా తీసుకుని నిర్వహించాలని, దీనిపై ఇప్పటికే పలుమార్లు సమీక్షలు చేశామని పేర్కొన్నారు. అలాగే ఈ కార్యక్రమం అమలు చేయడంపై అధికారులకు పలు కీలక ఆదేశాలు జారీ చేశారు.
స్పందనపై సమీక్షలో సీఎం జగన్ చేసిన పలు కీలక సూచనలు..
- ఇప్పటికే స్పందన కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నాం, స్పందనకు మరింత మెరుగైన రూపమే జగనన్నకు చెబుదాం.
- నాణ్యమైన సేవలను ప్రజలకు అందించడమే జగనన్నకు చెబుదాం లక్ష్యం.
- అలాగే ఇండివిడ్యువల్ గ్రీవెన్సెస్ను అత్యంత నాణ్యంగా పరిష్కరించడమే కార్యక్రమ ముఖ్య ఉద్దేశం.
- 1902 హెల్ప్లైన్ నంబర్కు కాల్ చేసి గ్రీవెన్స్ రిజిస్టర్ చేస్తే, దానిని అత్యంత నాణ్యతతో పరిష్కరించాలి.
- దీని అమలుకు సీఎంఓ, ప్రభుత్వ శాఖల అధిపతులు, జిల్లాలు, డివిజన్ స్థాయిలో, మండల స్థాయిలో మానిటరింగ్ యూనిట్లు ఉంటాయి.
- తమ పరిధిలోని ఈ యూనిట్లను కలెక్టర్లు తప్పనిసరిగా మానిటర్ చేస్తుండాలి.
- గ్రీవెన్స్ పరిష్కారంలో క్వాలిటీని పెంచడం అన్నది ప్రధాన లక్ష్యం కావాలి.
- ప్రాజెక్ట్ మానిటరింగ్ యూనిట్ల ద్వారా పర్యవేక్షణ చేస్తేనే అది సాధ్యపడుతుంది.
- ఫిర్యాదు ఇచ్చిన వ్యక్తికి సంతృప్తి కలిగించడం అన్నది ముఖ్యమైన విషయం.
- వ్యక్తిగత ఫిర్యాదులు, కుటుంబం స్థాయిలో వచ్చే ఫిర్యాదులను నమోదు చేసిన తర్వాత వాటిని నిర్ణీత వ్యవధిలో పరిష్కరించాలి.
- ప్రభుత్వ సేవలు, పథకాలపై ఎంక్వైరీ సహా ముఖ్యమంత్రి సందేశాలను నేరుగా చేరవేయడం అన్నది దీని ముఖ్య ఉద్దేశం.
- ఈ కార్యక్రమంలో ముఖ్యమంత్రి నేరుగా ప్రజలతో కనెక్ట్ అయి ఉండటంతో వారి ఫిర్యాదులను నేరుగా తెలియచేయజేసే అవకాశం ఉంటుంది.
- ముఖ్యమంత్రి కార్యాలయం ఫిర్యాదులను నిర్దేశిత సమయంలోగా పరిష్కారం అయ్యేలా చూస్తుంది.
- ఐవీఆర్ఎస్, ఎస్ఎంఎస్ ల ద్వారా తాము చెప్పిన సమస్యల పరిష్కారంపై ప్రజలకు రెగ్యులర్ అప్డేట్స్ అందుతాయి.
- ఇక హెల్ప్లైన్ ద్వారా సమస్యల పరిష్కారంపై అర్జీదారులనుంచి ఫీడ్ బ్యాక్ కూడా తీసుకుంటుంది.
- గ్రామ, వార్డు సచివాలయాల్లో వాలంటీర్లు ప్రతి ఇంటినీ సందర్శించి 1902 హెల్ప్లైన్ గురించి అవగాహన కల్పిస్తారు.
- జగనన్నకు చెబుదాం కార్యక్రమం అమల్లో మూడు కీలక యంత్రాంగాల ఉంటాయి.
- సీఎం కార్యాలయం నుంచి మండల కార్యాలయాల వరకూ ప్రాజెక్ట్ మానిటరింగ్ యూనిట్లు ఉంటాయి.
- ప్రతి జిల్లాకు సీనియర్ ఐఏఎస్ అధికారులు ప్రత్యేకాధికారులుగా ఉంటారు.
- ప్రతి 15 రోజులకోసారి సంబంధిత జిల్లాలను క్రమం తప్పకుండా వీరు సందర్శించి పర్యవేక్షిస్తారు.
- వీరు సమస్యల పరిష్కారాల తీరును రాండమ్గా చెక్చేస్తారు, అలాగే ప్రాజెక్ట్ మానిటరింగ్ యూనిట్ల పనితీరును పర్యవేక్షిస్తారు.
- ఎక్కడైనా సమస్య పరిష్కారం పట్ల సంతృప్తి లేకపోతే, ఎస్ఎంఎస్, ఐవీఆర్ఎస్ ద్వారా వచ్చిన ఫీడ్ బ్యాక్ ఆధారంగా దాన్ని తిరిగి తెరుస్తారు.
- చీఫ్ సెక్రటరీ, సీఎంఓ, డీజీపీతో కలిసి రెగ్యులర్గా మానిటర్ చేస్తారని, ప్రతి 15 రోజులకోసారి పూర్తిస్థాయిలో సమీక్ష ఉంటుంది.
- జగనన్నకు చెబుదాం అమలుకు ప్రతి కలెక్టర్కు రూ.3 కోట్ల రూపాయలను తక్షణ నిధులుగా ప్రభుత్వం ఇస్తుంది.
- అవసరమైన చోట.. ఈ డబ్బును ఖర్చు చేయవచ్చు, వీటిని ఖర్చు చేసే అధికారం కలెక్టర్కు ఇస్తున్నాం.
- ఈ కార్యక్రమానికి ముఖ్యమంత్రి పేరు పెట్టారంటే మొత్తం ప్రభుత్వం యంత్రాంగం పేరు పెట్టినట్టే భావించాలి.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xE