ఓటమెరుగని వీరుడు ఆయన.. ఉమ్మడి విశాఖ జిల్లాలో దమ్మున్న నేత.. వరుసగా నాలుగుసార్లు ఎమ్మెల్యేగా, ఓసారి ఎంపీగా గెలిచిన నాయకుడు.. ఆయనే టీడీపీ సీనియర్ నేత గంటా శ్రీనివాస్ రావు. సిట్టింగ్ స్థానాల్లోనే కొందరు నేతలు మరోసారి గెలిచేందుకు నానా తంటాలు పడుతున్నారు. కానీ గంటా శ్రీనివాస్ రావు నాలుగు సార్లు నాలుగు వేర్వేరు స్థానాల నుంచి పోటీ చేసి గెలుపొందారు. అయితే ఈసారి గంటకు ఏ స్థానం నుంచి టికెట్ దక్కుతుంది?.. అసలు టికెట్ దక్కుతుందా? లేదా? అన్నది చర్చనీయాంశంగా మారింది.
గతంలో గంటా భీమునిపట్నం, చోడవరం, అనకాపల్లి స్థానాల నుంచి పోటీ చేసి గెలుపొందారు. ఈక్రమంలో వచ్చే ఎన్నికల్లో ఆయా స్థానాల్లో ఓ స్థానం నుంచి పోటీ చేసేందుకు గంటా శ్రీనివాస్ రావు సిద్ధమవుతున్నారు. హైకమాండ్ నిర్ణయం కోసం పలుమార్లు గంటా సంప్రదించినప్పటికీ.. అటు నుంచి సరైన స్పందన లేదట. అసలు టికెట్ దక్కే అవకాశాలు కూడా కనిపించడం లేదట. దీంతో ఈసారి టికెట్ దక్కుతుందో లేదో అని కలవరపడుతున్నారట గంటా శ్రీనివాస్ రావు.
ఏపీలో టీడీపీ అధికారం కోల్పోయినప్పటి నుంచి హైకమాండ్కి కొంచెంద దూరంగా ఉంటున్నారు గంటా. పార్టీ కార్యక్రమాల్లో కూడా అంటీ అంటనట్లు వ్యవహరిస్తున్నారు. అప్పట్లో రాజధాని విషయంలో కూడా వైసీపీకి మద్ధతుగా మాట్లాడి గంటా సంచలనంగా మారారు. అప్పుడే గంటా పార్టీ కండువా మార్చేస్తారని.. వైసీపీ తీర్థం పుచ్చుకుంటారని ప్రచారం జరిగింది. కానీ చివరికి ఏమయిందో ఏమో గంటా వైసీపీలోకి వెళ్లకుండా టీడీపీలోనే ఉండిపోయారు. ఆ తర్వాత విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణను వ్యతిరేకిస్తూ హైకమాండ్ నిర్ణయాన్ని పక్కకు పెట్టి రాజీనామా చేసేశారు.
ఈక్రమంలో గత నాలుగైదేళ్లలో జరిగిన పరిణామాలను టీడీపీ హైకమాండ్ పరిశీలిస్తోంది. అందుకే గంటా టికెట్ విషయంపై ఇంకా స్పష్టం ఇవ్వడం లేదట. అలాగే ఆయన కోరుతున్న సీట్లన్నీ జనసేనకు కేటాయించినవే ఉండడంతో గంటాకు సీటు విషయంలో హైకమాండ్ ఏ నిర్ణయం తీసుకోలేకపోతోందట. అదే సమయంలో విజయనగరం ఎంపీ టికెట్ గంటాకు ఇచ్చే ఆలోచనలో ఉందని ప్రచారం జరుగుతోంది. అది కాకపోతే పార్టీ అధికారంలోకి వచ్చాక నామినేటెడ్ పదవి కట్టబెడుతామని పార్టీ పెద్దలు చెబుతున్నారట. ఈ పరిణామాల మధ్య సీటు టికెట్ దక్కుతుందో లేదో అని అయోమయంలో ఉన్నారు గంటా శ్రీనివాసరావు.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEY