ఉత్తమ ఎన్నికల అధికారిగా గోపాలకృష్ణ ద్వివేదికి అవార్డు

Andhra Pradesh Latest News, AP Breaking News, Ap Political Live Updates, Ap Political News, AP Political Updates 2020, Best Chief Electoral Officer Award, Gopal Krishna Dwivedi, Gopal Krishna Dwivedi Gets Best Chief Electoral Officer Award, Mango News Telugu
2019 ఏప్రిల్ లో జరిగిన సార్వత్రిక ఎన్నికలను పారదర్శకంగా నిర్వహించినందుకు గాను ‘ఉత్తమ ఎన్నికల నిర్వహణ’ కేటగిరీ కింద ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రం అవార్డు దక్కించుకుంది. అప్పుడు రాష్ట్రంలో చీఫ్ ఎలక్టోరల్ ఆఫీసర్ (సీఈవో) గా విధులు నిర్వహించిన సీనియర్ ఐఏఎస్ అధికారి గోపాల్ కృష్ణ ద్వివేది ఉత్తమ ఎన్నికల అధికారిగా నిలిచారు. భారత ఎన్నికల సంఘం(ఈసీఐ) ఇందుకు సంబంధించి ప్రకటన విడుదల చేసింది. జాతీయ ఓటర్ల దినోత్సవం సందర్భంగా జనవరి 25న ఢిల్లీలో జరగనున్న కార్యక్రమంలో గోపాలకృష్ణ ద్వివేదిని ఈ అవార్డుతో సత్కరించనున్నారు, అలాగే రూ.లక్ష నగదు బహుమతిని కూడా అందజేస్తారు. ఎన్నికల సమయంలో సీఈఓగా ఉన్న ద్వివేదిని ఆతరువాత బదిలీ చేసి పంచాయతీ రాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీగా నియమించారు. ఎన్నికల నిర్వహణకు సంబంధించి ఏపీతో పాటు పంజాబ్, ఒడిశా రాష్ట్రాలు కూడా అవార్డులు అందుకోనున్నాయి.

 

[subscribe]

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

13 + eight =