పెందుర్తి నుంచి గుడివాడ అమర్నాథ్ పోటీ..?

Gudivada Amarnath Contest From Pendurthi, Amarnath Contest From Pendurthi, Amarnath From Pendurthi, Pendurthi Amarnath, Gudivada Amarnath, Pendurthi, Anakapalli, YCP, CM Jagan, Latest Pendurthi News, Pendurthi Seat News, Amarnath Pendurthi News, CM Jagan, Andhra Pradesh, AP Polictical News, Assembly Elections, Mango News, Mango News Telugu
Gudivada amarnath, Pendurthi, Anakapalli, YCP, CM Jagan

అనకాపల్లి సిట్టింగ్ ఎమ్మెల్యే గుడివాడ అమర్నాథ్‌కు వైసీపీ హైకమాండ్ షాక్ ఇచ్చిన విషయం తెలిసిందే. వచ్చే ఎన్నికల్లో అమర్నాథ్‌కు అనకాపల్లి టికెట్ ఇచ్చేందుకు నిరాకరించింది. ఇటీవల పలు స్థానాలకు ఇంఛార్జ్‌లను మార్చిన వైసీపీ అధిష్టానం.. అనకాపల్లి ఇంఛార్జ్‌‌ను కూడా మార్చేసింది. ప్రస్తుతం ఇంఛార్జ్‌గా ఉన్న అమర్నాథ్‌ను పక్కనపెట్టి మలసాల భరత్ కుమార్‌ను కొత్త ఇంఛార్జ్‌గా నియమించింది. వచ్చే ఎన్నికల్లో అనకాపల్లి నుంచి భరత్ కుమార్ పోటీ చేయనున్నారు. తనకు సీటు నిరాకరించడంతో ఇటీవల గుడివాడ అమర్నాథ్ ఎమోషనల్ అయ్యారు. ఓ సభలో అనకాపల్లి ప్రజలను ఉద్దేశించి ప్రసంగిస్తూ కన్నీరు పెట్టుకున్నారు.

అయితే అనకాపల్లి టికెట్ నిరాకరించడంతో.. గుడివాడ అమర్నాథ్ ఎక్కడి నుంచి పోటీ చేస్తారనేది ప్రస్తుతం చర్చనీయాంశంగా మారింది. ముందు అనకాపల్లి నుంచి అమర్నాథ్ ఎంపీగా పోటీ చేస్తారని గుసగుసలు వినిపించాయి. కానీ ప్రస్తుతం అనకాపల్లి ఇంఛార్జ్‌గా ఉన్న భరత్ కుమార్, గుడివాడ అమర్నాథ్ ఇద్దరూ కాపు సామాజిక వర్గానికి చెందిన వారే. కాబట్టి సామాజిక సమీకరణల నేపధ్యంలో అమర్నాథ్‌కు ఎంపీ టికెట్ దక్కే అవకాశం లేదు. అటు అనకాపల్లి ఎంపీ టికెట్ గవర సామాజిక వర్గానికి చెందిన వ్యక్తి ఇవ్వనున్నట్లు తెలుస్తోంది.

అయితే ఇప్పుడు ఓ కొత్త నియోజకవర్గం పేరు తెరపైకి వచ్చింది. పెందుర్తి నుంచి గుడివాడ అమర్నాథ్ పోటీ చేయబోతున్నారంటూ ప్రచారం జరుగుతోంది. ప్రస్తుతం పెందుర్తి సిట్టింగ్ ఎమ్మెల్యేగా ఉన్న అదీప్ రాజ్‌పై నియోజకవర్గంలో పెద్ద ఎత్తున వ్యతిరేకత ఉంది. ఆయన పనితీరుపై నియోజకవర్గ ప్రజలు కూడా అసంతృప్తితో ఉన్నారు. వైసీపీ హైకమాండ్ చేయించిన సర్వేల్లో కూడా నియోజకవర్గంలో అదీప్ రాజ్‌పై తీవ్ర వ్యతిరేకత ఉన్నట్లు తేలింది. దీంతో ఈసారి అదీప్ రాజ్‌ను పక్కకు పెట్టాలని హైకమాండ్ భావిస్తోందట.

ఇక తెలుగు దేశం, జనసేన ఈసారి పొత్తు పెట్టుకొని ఎన్నికలకు వెళ్తోన్న విషయం తెలిసిందే. ఆ స్థానం జనసేనకు కేటాయించినట్లు తెలుస్తోంది. జనసేన నేత పంచకర్ల రమేష్ బాబు పెందుర్తి నుంచి బరిలోకి దిగనున్నట్లు ప్రచారం జరుగుతోంది. పంచకర్ల రమేష్ బాబు కాపు సామాజిక వర్గానికి చెందిన వారు కావడంతో.. అదే వర్గానికి చెందిన గుడివాడ అమర్నాథ్‌ను పెందుర్తి నుంచి బరిలోకి దింపాలని వైసీపీ హైకమాండ్ భావిస్తోందట. పెందుర్తి టికెట్ గుడివాడ అమర్నాథ్‌కు ఇచ్చేందుకు అధినేత జగన్ కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు తెలుస్తోంది. త్వరలో వైసీపీ విడుదల చేయబోయే జాబితా పెందుర్తి నుంచి గుడివాడ అమర్నాథ్ పేరు ఉంటుందని పార్టీ వర్గాలు చెబుతున్నాయి

మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xE

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

18 − 18 =