రాజకీయ వారసత్వంపై ఆసక్తికర వ్యాఖ్యలు చేసిన గుడివాడ ఎమ్మెల్యే కొడాలి నాని

Gudivada MLA Kodali Nani Interesting Comments in YSRCP Plenary at Machilipatnam, YSRCP Plenary at Machilipatnam, MLA Kodali Nani Interesting Comments in YSRCP Plenary at Machilipatnam, Kodali Nani Comments in YSRCP Plenary at Machilipatnam, MLA Kodali Nani Sensational Comments in YSRCP Plenary at Machilipatnam, Machilipatnam YSRCP Plenary, YSRCP Plenary, Machilipatnam, MLA Kodali Nani Comments In YSRCP Machilipatnam Plenary, YSRCP Plenary 2022, 2022 YSRCP Plenary, Gudivada MLA Kodali Nani, MLA Kodali Nani, YSRCP Machilipatnam Plenary News, YSRCP Machilipatnam Plenary Latest News, YSRCP Machilipatnam Plenary Latest Updates, YSRCP Machilipatnam Plenary Live Updates, Mango News, Mango News Telugu,

ఆంధ్రప్రదేశ్ మాజీ మంత్రి, గుడివాడ ఎమ్మెల్యే కొడాలి నాని మరోసారి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. మచిలీపట్నం వేదికగా జరిగిన వైఎస్సార్‌సీపీ ప్లీనరీలో పాల్గొన్న ఆయన రాజకీయ వారసత్వంపై కొన్ని ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఈ సందర్భంగా కొడాలి నాని మాట్లాడుతూ.. వారసత్వమంటే తాత-తండ్రి-కొడుకు.. ఇలా ఉంటుందని, అంతే కానీ మామా-అల్లుళ్లు కాదని సీరియస్ కామెంట్స్ చేశారు. వైఎస్సార్‌ తర్వాత జగన్‌ అని, అలాగే సీనియర్‌ ఎన్టీఆర్‌ తర్వాత జూనియర్‌ ఎన్టీఆర్‌ మాత్రమేనని స్పష్టం చేశారు.

కానీ మామ పేరు చెప్పుకునే నాయకులు కూడా మన వద్ద ఉన్నారని, రాష్ట్రంలో చంద్రబాబు, మచిలీపట్నంలో కొల్లు రవీంద్ర వంటి వారు ఇల్లరికం అల్లుళ్లని పేర్కొన్నారు. అలాంటి వాళ్ళ పాలన మనకు అక్కరలేదని, వారిని ఇంటికి పంపించాలని నాని అన్నారు. ఇక మచిలీపట్నంలో పేర్ని నాని నిలబడినా, లేదంటే ఒకవేళ ఆయన కుమారుడు పేర్ని కృష్ణమూర్తి నిలబడినా ప్రజలతో పాటు పార్టీ కార్యకర్తలు కూడా అండగా నిలబడాలని కోరారు. సీఎం జగన్ ఎంతమంది అడ్డుపడినా రాష్ట్రాన్ని అభివృద్ధి పథం వైపు నడిపిస్తున్నారని, కార్యకర్తలు, నాయకులు అందరూ ఆయన అడుగుజాడల్లో నడవాలని కొడాలి నాని పిలుపునిచ్చారు.

మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

two × four =