వైసీపీలో సీట్ల పంచాయితీ కాక రేపుతోంది. సీఎం జగన్ ఇంఛార్జ్ల మార్పు అంశం సంచలనంగా మారుతోంది. ఇప్పటికే 35 అసెంబ్లీ స్థానాల ఇంఛార్జ్లను.. 3 లోక్ సభ స్థానాల ఇంఛార్జ్లను జగన్ మార్చేశారు. రాబోయే రోజుల్లో మరికొందరిని మార్చి కొత్తవారికి అవకాశం ఇచ్చే అవకాశం కనిపిస్తోంది. ఇప్పటికే టికెట్ల కోసం పెద్ద ఎత్తున నేతలు పోటీపడుతున్నారు. అయితే సినీనటుడు, ఎలక్ట్రానిక్ మీడియా అడ్వైజర్ ఆలీ కూడా మెంబర్ ఆఫ్ పార్లమెంట్ అని పిలుపించుకోవాలని తహతహలాడుతున్నారు. ఈ మేరకు ఎంపీ టికెట్ కోసం ప్రయత్నిస్తున్నారు.
2019 అసెంబ్లీ ఎన్నికల ముంగిట వైసీపీలో చేరారు ఆలీ. అప్పట్లో వైసీపీ గెలుపుకోసం ఆలీ తీవ్రంగా కృషి చేశారు. మైనార్టీలు ఎక్కువగా ఉన్న ప్రాంతాల్లో వైసీపీ అభ్యర్థుల తరుపున ప్రచారం చేశారు. అలి క్యాంపెయిన్ చేయడం వైసీపీకీ బాగా కలిసొచ్చింది. ఫలితంగా ఆయా స్థానాల్లో వైసీపీ అభ్యర్థులు గెలుపొందారు. అయితే అప్పట్లో ఆలీ రాజ్యసభ సీటు ఆశించారు. అదికాకపోయినా రాష్ట్రమైనార్టీ కార్పోరేషన్ ఛైర్మన్ పదవి అయినా ఇవ్వాలని కోరారు. కానీ చివరికి సీఎం జగన్మోహన్ రెడ్డి ఎలక్ట్రానిక్ మీడియా అడ్వైజర్ పదవిని కట్టబెట్టారు. ఇక త్వరలో అసెంబ్లీ ఎన్నికలు జరగబోతుండడంతో అలీ మళ్లీ యాక్టివ్ అయ్యారు. వైసీపీ సామాజిక సాధికార బస్సు యాత్రతో పాటు పలు కార్యక్రమాల్లో పాల్గొంటున్నారు.
అయితే ఈసారి అలి ఎంపీ టికెట్ ఆశిస్తున్నారట. ముందుగా గుంటూరు ఎంపీ సీటుపై ఆలీ కన్నేశారట. కానీ ఇటీవల వైసీపీలో చేరిన అంబటి రాయుడికి ఈ టికెట్ ఇవ్వనున్నట్లు ప్రచారం జరుగుతోంది. దీంతో అది కాకపోయినా ముస్లింలు అధికంగా ఉన్న కర్నూలు లేదా నంద్యాలలో ఏదో ఒకటి ఇవ్వాలని హైకమాండ్ వద్ద పట్టుపట్టుకొని కూర్చున్నారట. చివరికి టికెట్ ఇవ్వకపోయినా.. ఈసారి అయినా రాజ్యసభ సీటు ఇవ్వాలని పట్టుపట్టుపడుతున్నారట. లోక్సభ టికెట్ ఇస్తే ప్రత్యక్షంగా.. రాజ్యసభ సీటు ఇస్తే పరోక్ష్యంగానైనా పార్లమెంట్ సభ్యుడినని అనిపించుకోవాలని ఆలీ అనుకుంటున్నారట. మరి వైసీపీ హైకమాండ్ ఏ నిర్ణయం తీసుకుంటుందనేది ప్రస్తుతం ఆసక్తికరంగా మారింది.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xE