వివిధ రంగాల్లో అత్యుత్తమ సేవలందించిన వ్యక్తులకు, సంస్థలకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం ఇటీవలే వైఎస్ఆర్ లైఫ్టైం ఏచీవ్మెంట్, వైఎస్ఆర్ ఏచీవ్మెంట్ అవార్డును ప్రకటించిన విషయం తెలిసిందే. ముందుగా ఈ అవార్డుల ప్రదానోత్సవం కార్యక్రక్రమాన్ని ఆగస్టు 13న నిర్వహించాలని ప్రభుత్వం నిర్ణయించింది. అయితే వైఎస్ఆర్ అవార్డుల ప్రదానోత్సవం కార్యక్రమాన్ని వాయిదా వేస్తున్నట్టు తాజాగా ప్రభుత్వం ప్రకటించింది. ఈ కార్యక్రమాన్ని అక్టోబరు లేదా నవంబరు నెలల్లో నిర్వహించనున్నట్టు తెలిపారు. రాష్ట్రంలో 150 మందికి మించి ప్రజలు ఎక్కడా కూడా హాజరుకావడం లేదా గుమికూడద్దొని వైద్య ఆరోగ్య శాఖ ఇటీవల ఉత్తర్వులు జారీ చేసింది.
ఈ క్రమంలో వైఎస్ఆర్ అవార్డు గ్రహీతల్లో పెద్ద వయస్సు ఉన్నవారు ఉండడటంతో పాటుగా, ప్రభుత్వ ఆదేశాలు అమల్లో ఉండడంతో అవార్డుల ప్రదానోత్సవ కార్యక్రమాన్ని వాయిదా వేస్తున్నట్టుగా ప్రభుత్వం పేర్కొంది. అవార్డు గ్రహీతల వయస్సు, వారి యొక్క ఆరోగ్యాన్ని దృష్టిలో ఉంచుకుని ఈ నెల 13న జరగాల్సిన కార్యక్రమాన్ని వాయిదా వేస్తున్నామని, వచ్చే అక్టోబరు లేదా నవంబరు నెలలో ఒక తేదీ నిర్ణయించి ఈ కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించనున్నట్టు ప్రభుత్వం వెల్లడించింది.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ