ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో విద్యార్థులకు అండగా ఉండేందుకు ‘’జగనన్న విద్యా దీవెన” పేరుతో ఓ పథకాన్ని ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ప్రారంభించిన సంగతి తెలిసిందే. జగన్న విద్యా దీవెన పథకం ద్వారా ఐటీఐ, పాలిటెక్నిక్, డిగ్రీ, పీజీ, పీహెచ్డీ వరకు అన్ని ఉన్నత విద్యలు చదివే ఎస్సీ, ఎస్టీ, బీసీ, ఈబీసీ, కాపు, మైనారిటీ, దివ్యాంగ విద్యార్థులకు పూర్తి స్థాయిలో ఫీజు రియంబర్స్మెంట్ చెల్లిస్తారు. 2020–21 విద్యా సంవత్సరం నుంచి ప్రతి త్రైమాసికం పూర్తైన తర్వాత విద్యార్థుల తల్లుల ఖాతాలోనే నేరుగా ఫీజు రీయింబర్స్మెంట్ డబ్బులు జమ చేస్తున్నారు. ఈ నేపథ్యంలో జగనన్న విద్యాదీవెన రెన్యువల్స్ గడువును డిసెంబర్ 30 వరకు పొడిగిస్తూ రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. అలాగే ఈ పథకానికి కొత్తగా దరఖాస్తు చేసుకునే విద్యార్థులకు డిసెంబర్ 21 నుంచి అధికారులు అవకాశం కల్పించారు. కాలేజీలలో చేరిన రోజునుంచి 20 రోజులలోపు ఆయా కాలేజీల ద్వారా వెబ్ సైట్ లో అభ్యర్థుల వివరాలు నమోదు చేయాల్సి ఉంటుందని అధికారులు వెల్లడించారు.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ