జగనన్న విద్యాదీవెన కింద 11.02 లక్షల విద్యార్థుల తల్లుల ఖాతాల్లో రూ.694 కోట్లు జమ : సీఎం జగన్

Jagananna Vidya Deevena Scheme CM YS Jagan Released Rs 694 Cr Funds for 11.02 Lakh Students, YS Jagan Mohan Reddy To Disburse Jagananna Vidya Deevena Scheme Funds In Bapatla, AP CM YS Jagan Mohan Reddy To Disburse Jagananna Vidya Deevena Scheme Funds In Bapatla, AP CM YS Jagan To Disburse Jagananna Vidya Deevena Scheme Funds In Bapatla, AP CM To Disburse Jagananna Vidya Deevena Scheme Funds In Bapatla, Jagananna Vidya Deevena Scheme Funds, Jagananna Vidya Deevena, AP CM will release the 4 installment of Jagananna Vidya Deevena, Bapatla public meeting, Jagananna Vidya Deevena 2022, Jagananna Vidya Deevena Scheme News, Jagananna Vidya Deevena Scheme Latest News, Jagananna Vidya Deevena Scheme Latest Updates, Jagananna Vidya Deevena Scheme Live Updates, public meeting In Bapatla, AP CM YS Jagan Mohan Reddy, CM YS Jagan Mohan Reddy, AP CM YS Jagan, YS Jagan Mohan Reddy, Jagan Mohan Reddy, YS Jagan, CM Jagan, CM YS Jagan, Mango News, Mango News Telugu,

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ మోహన్ ‌రెడ్డి ఈ ఏడాది ‘జగనన్న విద్యాదీవెన’ పథకం కింద ఏప్రిల్-జూన్ 2022 త్రైమాసికానికి రూ.694 కోట్ల నిధులు విడుదల చేశారు. గురువారం ఉదయం బాపట్ల ఆర్ట్స్‌ అండ్‌ సైన్స్‌ కాలేజ్‌ గ్రౌండ్‌ లో జరిగిన కార్యక్రమంలో ఫీజు రీయింబర్స్‌మెంట్ కింద రాష్ట్రవ్యాప్తంగా మొత్తం 11.02 లక్షల మంది విద్యార్థులకు లబ్ది చేకూరేలా వారి తల్లుల ఖాతాల్లో రూ.694 కోట్లను సీఎం వైఎస్ జగన్ బటన్ నొక్కి జమ చేశారు. పేద విద్యార్థులు కూడా పెద్ద చదువులు చదవాలన్న సమున్నత లక్ష్యంతో జగన్న విద్యా దీవెన పథకం ద్వారా ఐటీఐ, పాలిటెక్నిక్‌, డిగ్రీ, ఇంజనీరింగ్, మెడిసిన్‌ తదితర కోర్సులు చదివే విద్యార్థులు కాలేజీలకు చెల్లించాల్సిన పూర్తి ఫీజుల మొత్తాన్ని ప్రతి మూడు నెలలకొకసారి అనగా మొత్తం నాలుగు విడతల్లో విద్యార్థుల తల్లుల ఖాతాల్లో ప్రభుత్వం జమ చేస్తుంది. ఇప్పటివరకు జగనన్న విద్యాదీవెన,జగనన్న వసతి పథకాల కింద సీఎం వైఎస్ జగన్ నేతృత్వంలోని ఏపీ ప్రభుత్వం రూ.11,715 కోట్లు ఖర్చు చేసింది.

ముందుగా బాపట్ల ఆర్ట్స్‌ అండ్‌ సైన్స్‌ కాలేజ్‌ గ్రౌండ్‌ చేరుకున్న సీఎం వైఎస్ జగన్‌ విద్యాదీవెన కార్యక్రమంకు సంబంధించి విద్యార్ధులు, వారి తల్లిదండ్రులతో మాట్లాడారు. అనంతరం జ్యోతి ప్రజ్వలన చేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా సభలో సీఎం వైఎస్ జగన్ మాట్లాడుతూ, ముందుగా రాఖీ పండుగ సందర్భంగా రాష్ట్రంలోని ప్రతి అక్కకు, చెల్లెమ్మకు శుభాకాంక్షలు తెలియజేశారు. అక్షరాలా 11.02 లక్షల మంది పిల్లలకు మంచి జరిగిస్తూ, వారికీ సంబంధించిన ఫీజులు ఎంతైనాగాని, పూర్తి రీయింబర్స్‌మెంట్ అందించేలా ప్రతి మూడునెలలకోసారి తల్లుల ఖాతాలోకి డబ్బు జమజేసే కార్యక్రమానికి శ్రీకారం చుడుతున్నామని చెప్పారు. పిల్లలకు మనం ఇచ్చే విలువైన ఆస్తి నాణ్యమైన చదువేనని, ప్రపంచంతో పోటీ పడేలా పిల్లలకు శిక్షణ అందిస్తున్నామన్నారు. రాష్ట్రంలోని ప్రతి బిడ్డ చదువుకోవాలన్నదే తన ఆకాంక్ష అని సీఎం పేర్కొన్నారు.

పిల్లల చదువు కోసం ఫీజులు కట్టలేక తల్లిదండ్రులు ఇబ్బందులు పడి, అప్పులపాలు కాకుండా జగనన్న విద్యా దీవెన పథకాన్ని అమలు చేస్తున్నామన్నారు. జగనన్న విద్యాదీవెన, వసతి దీవెన కింద ఇప్పటికి రూ.11,715 కోట్లు నేరుగా అందించామని తెలిపారు. పథకాల అమలు విషయంలో గత పాలన, ఈ ప్రభుత్వ పాలనలో తేడాను ప్రజలు గమనించాలని సీఎం వైఎస్ జగన్‌ కోరారు. ఇక ఈ కార్యక్రమంలో మంత్రులు బొత్స సత్యనారాయణ, కొట్టు సత్యనారాయణ, ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు, డిప్యూటీ స్పీకర్ కోన రఘుపతి, పోతుల సునీత, పలువురు నాయకులు, అధికారులు పాల్గొన్నారు.

మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEY

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

4 × one =