ప్రధానమంత్రి నరేంద్ర మోదీతో జనసేన పార్టీ అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ భేటీ కానున్నారు. గురువారం రాత్రి విశాఖపట్నంలోని ఐఎన్ఎస్ చోళలో ఈ భేటీ జరగనుంది. ఈ నేపథ్యంలో పవన్ కళ్యాణ్, పార్టీ పీఏసీ చైర్మన్ నాదెండ్ల మనోహర్ తో కలిసి శుక్రవారం సాయంత్రం వైజాగ్ కు చేరుకున్నారు. రాత్రి 8.30 గంటల తర్వాత ప్రధానితో పవన్ కళ్యాణ్ భేటీ జరగనుంది. దాదాపు మూడేళ్ల తర్వాత ప్రధానితో పవన్ కళ్యాణ్ సమావేశం కానుండడం విశేషం.
ఏపీలో గత అసెంబ్లీ ఎన్నికలు ముగిసిన కొన్నాళ్లనుంచే బీజేపీ, జనసేన పార్టీలు పొత్తులో ఉన్న విషయం తెలిసిందే. వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో పొత్తులు, రాష్ట్రంలో తాజా రాజకీయ పరిస్థితులపై పెద్దఎత్తున చర్చ జరుగుతున్న నేపథ్యంలో తాజాగా ప్రధానితో పవన్ కళ్యాణ్ భేటీ కానుండడం ప్రత్యేక ప్రాధాన్యత సంతరించుకోవడంతో పాటుగా, రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది. రాష్ట్రంలో నెలకొన్న పరిస్థితులు, ఇరుపార్టీల భవిష్యత్ కార్యాచరణ అంశం సహా ఏపీకి సంబంధించి పలు అంశాలపై పవన్ కళ్యాణ్ ప్రధానితో చర్చించే అవకాశం ఉన్నట్టు తెలుస్తుంది. మరోవైపు శని, ఆది వారాల్లో కూడా రెండు రోజుల పాటుగా పవన్ కళ్యాణ్ విశాఖలోనే పర్యటించి, పార్టీ చేపడుతున్న జగనన్న ఇళ్లు పరిశీలన కార్యక్రమంలో పాల్గొననున్నట్టు సమాచారం.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xE