ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (ఏపీపీఎస్సీ) 2022, సెప్టెంబర్ 30న 92 గ్రూప్-1 పోస్టులకు సంబంధించిన నియామక ప్రక్రియ కోసం నోటిఫికేషన్ను విడుదల చేసిన విషయం తెలిసిందే. ముందుగా గ్రూప్-1 ప్రిలిమినరీ పరీక్షను 2022, డిసెంబర్ 18న నిర్వహించనున్నట్టు ఏపీపీఎస్సీ తెలిపింది. అయితే గ్రూప్-1 ప్రిలిమినరీ పరీక్ష ఆ తేదీ నుంచి వాయిదా పడిందని, వచ్చే జనవరి 8న నిర్వహించనున్నట్టుగా శుక్రవారం ఏపీపీఎస్సీ ఒక ప్రకటన విడుదల చేసింది.
“2022, డిసెంబర్ 18న నిర్వహించాల్సిన గ్రూప్-1 సర్వీసెస్ ప్రిలిమినరీ పరీక్ష పరిపాలనా కారణాల వల్ల వాయిదా పడింది. దీంతో గ్రూప్-1 ప్రిలిమినరీ పరీక్ష తిరిగి నిర్ణీత సమయాల ప్రకారం 2023, జనవరి 8వ తేదీన నిర్వహించబడుతుంది” అని ఏపీపీఎస్సీ ప్రకటించింది. మరోవైపు ఈ గ్రూప్-1 పోస్టుల కోసం ఆన్లైన్ లో అక్టోబర్ 13 నుంచి దరఖాస్తు ప్రక్రియను ప్రారంభం కాగా, నవంబర్ 5వ తేదీతో దరఖాస్తుల స్వీకరణకు గడువు ముగిసింది.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xE