జనసేన పార్టీ రాజకీయ వ్యవహారాల కమిటీ (పీఏసీ) ఛైర్మన్ నాదెండ్ల మనోహర్ బుధవారం సాయంత్రం బీజేపీ నేత, జాతీయ కార్యవర్గ సభ్యుడు కన్నా లక్ష్మీనారాయణతో భేటీ అయ్యారు. గుంటూరులోని కన్నా లక్ష్మీనారాయణ ఇంటిలో ఈ భేటీ జరిగింది. ఈ సందర్భంగా రాష్ట్ర రాజకీయాలు, తాజా పరిస్థితులపై చర్చ జరుగుతునట్టుగా తెలుస్తుంది. గత కొంతకాలంగా రాష్ట్ర బీజేపీ నాయకత్వంపై కన్నా అసంతృప్తిగా ఉన్నట్టు వార్తలు వస్తున్నాయి. ఈ నేపథ్యంలో కన్నా లక్ష్మీనారాయణతో నాదెండ్ల మనోహర్ భేటీ కావడం రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశమైంది. అలాగే రాబోయే ఎన్నికలు, పొత్తుల నేపథ్యంలో ఈ భేటీపై రాజకీయ ఆసక్తి కూడా నెలకుంది. కన్నాతో భేటీలో నాదెండ్ల మనోహర్ తో పాటుగా పలువురు జనసేన నాయకులు కూడా పాల్గొన్నారు.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xE