ఆంధ్రప్రదేశ్ లోని తూర్పుగోదావరి జిల్లా కాకినాడలో కరోనా కలకలం రేగింది. కాకినాడలోని ఎస్కేఆర్ ఉన్నత పాఠశాలలో 40 మంది ఎన్సీసీ విద్యార్థులలో కరోనా లక్షణాలు బయటపడ్డట్లు తెలుస్తోంది. ఈ పాఠశాలలోని ఎన్సీసీ క్యాంప్లో మొత్తం 300 మందికి పైగా విద్యార్థులు ఉండగా, వారిలో 40 మందికి వైరస్ సోకినట్లు అనుమానిస్తున్నారు. దీంతో అప్రమత్తమైన యూనిట్ కమాండింగ్ అధికారి ఆ 40 మందికి కోవిడ్-19 టెస్ట్లు చేయించారని, అలాగే క్యాంప్లో మిగిలిన వారికి వ్యాప్తి చెందకుండా ముందస్తు జాగ్రత్త చర్యల్లో భాగంగా ఆ విద్యార్థులను ఐసోలేషన్లో ఉంచినట్లు అధికారులు పేర్కొన్నారు. కాగా విద్యార్థులకు ఎన్సీసీ క్యాంప్ ఈ నెల 18 నుంచి ప్రారంభమయిందని, క్యాంప్లో 317 మంది ఉన్నట్లు అధికారులు తెలిపారు. అయితే కరోనా లక్షణాలను గుర్తించిన 40 మంది విద్యార్థులకు కరోనా పరీక్షలు నిర్వహించామని, ఈ పరీక్ష ఫలితాలు వచ్చిన తర్వాత ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లి వారి సూచనల మేరకు క్యాంప్ కొనసాగింపుపై నిర్ణయం తీసుకుంటామని వారు వెల్లడించారు.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEY