మార్చి 14న జనసేన ఆవిర్భావ దినోత్సవ సభను ఘనంగా నిర్వహించాలని పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ నిర్ణయించిన సంగతి తెలిసిందే. గుంటూరు జిల్లా తాడేపల్లి మండలంలోని ఇప్పటం గ్రామంలో జనసేన పార్టీ ఆవిర్భావ దినోత్సవ సభను నిర్వహించనున్నారు. ఈ నేపథ్యంలో జనసేన ఆవిర్భావ సభ పోస్టర్ ను పార్టీ పీఏసీ చైర్మన్ నాదెండ్ల మనోహర్ శుక్రవారం నాడు ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, జనసేన పార్టీ ఆవిర్భావ సభను కనీవినీ ఎరుగని రీతిలో నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తున్నట్టు తెలిపారు. పార్టీ కార్యకర్తలంతా పెద్ద ఎత్తున తరలివచ్చి సభను విజయవంతం చేయాలని కోరారు.
నిత్యం ప్రజల పక్షాన నిలుస్తూ పార్టీ వర్గాలు చేస్తున్న కార్యక్రమాలను జనసైనికులు, వీరమహిళలకు అంకితం ఇస్తూ పార్టీ అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ స్వయంగా ఈ పోస్టర్ కు రూపకల్పన చేయించినట్టు తెలిపారు. ఈ కార్యక్రమంలో పార్టీ ఉపాధ్యక్షులు బి.మహేందర్ రెడ్డి, పవన్ కళ్యాణ్ రాజకీయ కార్యదర్శి పీ.హరిప్రసాద్, పలువురు పీఏసీ సభ్యులు, పార్టీ నాయకులు, తదితరులు పాల్గొన్నారు. అలాగే జనసేన పార్టీ ఆవిర్భావ సభ కోసం ప్రత్యేకంగా రూపొందించిన గీతాన్ని (స్పెషల్ సాంగ్) కూడా నాదెండ్ల మనోహర్ ఆవిష్కరించారు. “జన జన జన జనసేనా” అంటూ సాగే ఈ పాట ప్రత్యేకంగా మహిళా మణుల్ని ఉత్తేజపరించే విధంగా రూపొందించినట్టు ఆయన తెలిపారు.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ