సాయుధ దళాల పతాక దినోత్సవం(ఆర్మ్డ్ ఫోర్సెస్ ఫ్లాగ్ డే) సందర్భంగా సైనిక కుటుంబాల సంక్షేమం కోసం కేంద్రీయ సైనిక బోర్డుకు జనసేన అధ్యక్షుడు పవన్ కల్యాణ్ రూ. కోటి విరాళం ఇవ్వాలని నిర్ణయించారు. విరాళం అందజేస్తున్న విషయాన్ని పవన్ కళ్యాణ్ తన ట్విటర్ ఖాతా ద్వారా వెల్లడించారు. ఇందుకు సంబంధించిన డీడీని తానే స్వయంగా ఢిల్లీకి వెళ్లి అధికారులకు అందిస్తానని తెలిపారు. ఈ సందర్భంగా దేశం పట్ల మన బాధ్యతను గుర్తు చేసినందుకు ప్రధానమంత్రి నరేంద్రమోదీకి పవన్ కళ్యాణ్ కృతజ్ఞతలు చెప్పారు. సైన్యంలో పనిచేస్తూ అమరులైన వారి కుటుంబాల సంక్షేమం కోసం కేంద్రప్రభుత్వం ‘కేంద్రీయ సైనిక బోర్డు’ను ఏర్పాటు చేసింది. భారతదేశ రక్షణ శాఖ మంత్రి చైర్మన్ గా, ముఖ్యమంత్రులు, త్రివిధ దళాల అధిపతులు ఈ బోర్డులో సభ్యులుగా ఉంటారు. డిసెంబర్ 7 ఆర్మ్డ్ ఫోర్సెస్ ఫ్లాగ్ డే సందర్భంగా సైనిక బోర్డు కార్యదర్శి బ్రిగేడియర్ మృగేంద్ర కుమార్ బోర్డు కార్యకలాపాలను తెలుపుతూ ఒక లేఖ రాశారు. పతాక దినోత్సవం గురించి ప్రసంగాన్ని వీడియో రూపంలో పంపమని కోరగా, ఈ మేరకు పవన్ కళ్యాణ్ వీడియోను రూపొందించి సైనిక బోర్డుకు పంపారు.
I am donating Rs1 crore to the
‘kendriya sainik board’ for the welfare our soldiers families. I will personally handover the DD to the concerned authorities in Delhi. My heartfelt gratitude to ‘PM Modiji’ for reminding our responsibility towards our Nation🙏#ArmedForcesFlagDay— Pawan Kalyan (@PawanKalyan) 6 December 2019
#ArmedForcesFlagDay pic.twitter.com/TH80LcjkqT
— Pawan Kalyan (@PawanKalyan) 6 December 2019
[subscribe]