మంగళగిరిలోని పార్టీ కార్యాలయంలో నేడు (జూన్ 4, శనివారం) జనసేన పార్టీ విస్తృతస్థాయి సమావేశం జరగనుంది. ఈ సమావేశంలో పార్టీ అధ్యక్షుడు పవన్ కళ్యాణ్, రాజకీయ వ్యవహారాల కమిటీ చైర్మన్ నాదెండ్ల మనోహర్, పార్టీ పొలిట్ బ్యూరో సభ్యులు, పీఏసీ సభ్యులు, రాష్ట్ర కమిటీ సభ్యులతో పాటు జిల్లా అధ్యక్షులు, వివిధ విభాగాల చైర్మన్లు, నియోజకవర్గ ఇంచార్జిలు, రాష్ట్ర అధికార ప్రతినిధులు, వీరమహిళ ప్రాంతీయ కమిటీ సభ్యులు పాల్గొననున్నారు. శనివారం మధ్యాహ్నం 2.30 గంటలకు ప్రారంభమయ్యే ఈ సమావేశం సుమారు 4 గంటల పాటు కొనసాగనుంది.
ఈ సమావేశంలో ప్రధానంగా రాష్ట్రంలో శాంతిభద్రతల పరిస్థితి, జనసేన కార్యకర్తలపై అక్రమ కేసులు బనాయింపు, జనసేన చేపట్టిన కౌలు రైతు భరోసా యాత్ర తదితర అంశాలపై లోతుగా చర్చించనున్నారు. ఈ సమావేశంలో కొన్ని ముఖ్యమైన తీర్మానాలను కూడా ఆమోదించనున్నారు. కాగా పవన్ కళ్యాణ్ జూన్ 3, శుక్రవారం సాయంత్రమే మంగళగిరి పార్టీ కార్యాలయానికి చేరుకున్నారు. ఈ సందర్భంగా మీడియా ప్రతినిధులతో చిట్ చాట్ లో కోనసీమలో అల్లర్లు, డీజీపీతో అపాయింట్మెంట్, సీఎం దావోస్ పర్యటన, బీజేపీతో సంబంధాలు, సీపీఎస్ రద్దు వంటి అంశాలపై పవన్ కళ్యాణ్ మాట్లాడారు.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYF