హైదరాబాద్లో మైనర్ బాలిక కిడ్నాప్, సామూహిక అత్యాచారం ఘటనపై సీబీఐ విచారణ జరిపించాలని తెలంగాణ బీజేపీ చీఫ్ బండి సంజయ్ డిమాండ్ చేశారు. ఈ మేరకు ఆయన నిందితులందరినీ అరెస్టు చేయాలని డిమాండ్ చేస్తూ శనివారం రాష్ట్ర ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్ రావుకు బహిరంగ లేఖ రాశారు. ఈ ఘటనలో పోలీసులు వ్యవహరిస్తున్న తీరును తప్పుబట్టారు. కేసులో అసలు నిందితులను పోలీసులు అరెస్ట్ చేయడం లేదని, వారిని ఈ కేసు నుంచి తప్పించటానికి పరోక్షంగా సాయపడుతున్నారని మండిపడ్డారు. ఈ కేసులో ప్రముఖుల పిల్లలు ఉన్నట్లుగా వార్తలొస్తున్నాయని, కేసును సీబీఐకి అప్పగించటం ద్వారా దీనిపై ప్రభుత్వం తన చిత్తశుద్ధి నిరూపించుకోవాలని సీఎం కేసీఆర్ ని లేఖలో కోరారు. అలాగే తెలంగాణలో పబ్స్ ను మూసివేయాలని బండి సంజయ్ ముఖ్యమంత్రిని కోరారు.
మే 28న హైదరాబాద్లోని జూబ్లీహిల్స్ ప్రాంతంలో గల అమ్నేషియా పబ్లో పార్టీ ముగించుకుని బయటకు వచ్చిన 17 ఏళ్ల బాలికను కొందరు యువకులు కిడ్నాప్ చేశారు. అనంతరం ఒక నిర్మానుష్య ప్రాంతానికి తీసుకెళ్లి సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. ఈ ఘటనపై మైనర్ బాలిక తండ్రి పోలీసులకు ఫిర్యాదు చేయడంతో విషయం వెలుగులోకి వచ్చింది. శుక్రవారం రాత్రి జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో వెస్ట్ జోన్ డీసీపీ జోయల్ డేవిస్ కేసు వివరాలను వెల్లడించారు. సీసీటీవీ ఫుటేజీని ప్రకారం ఈ ఘటనలో పాల్గొన్న ఐదుగురు నిందితులను గుర్తించామని, ఇందులో ఇద్దరు మేజర్లు, ముగ్గురు మైనర్లు అని తెలిపారు. ఈ కేసుకు సంబంధించి ఇప్పటికే ఇద్దరినీ అరెస్ట్ చేశామని, మిగిలిన వారిని కూడా త్వరలోనే అరెస్ట్ చేస్తామని తెలిపారు.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYF