రేపు ఢిల్లీలో పర్యటించనున్న పవన్ కళ్యాణ్

bjp, Delhi, indian student parliament, jana sena, Janasena Party, Janasena Pawan Kalyan, Janasena President, Janasena President Pawan Kalyan, Mango News Telugu, pawan kalyan, Pawan Kalyan Delhi, Pawan Kalyan Janasena, Pawan Kalyan Janasena Party
జనసేన పార్టీ అధ్యక్షుడు పవన్‌ కళ్యాణ్ ఫిబ్రవరి 20, గురువారం నాడు ఢిల్లీలో పర్యటించనున్నారు. ఈ పర్యటనలో భాగంగా రెండు ముఖ్యమైన కార్యక్రమాల్లో పాల్గొంటారు. గురువారం ఉదయం కేంద్రీయ సైనిక్ బోర్డు కార్యాలయాన్ని సందర్శిస్తారు. అమర సైనిక వీరుల కుటుంబాల సంక్షేమానికి ప్రకటించిన కోటి రూపాయల విరాళానికి సంబంధించిన చెక్‌ను ఈ సందర్భంగా సైనికాధికారులకు అందజేస్తారు. డిసెంబర్ 9న మిలటరీ డే సందర్భంగా అమరవీరుల కుటుంబాల సంక్షేమం కోసం పవన్ కళ్యాణ్ ఈ విరాళాన్ని ప్రకటించిన సంగతి తెలిసిందే.
అలాగే మధ్యాహ్నం 3 గంటలకు ఢిల్లీలోని విజ్ఞాన్ భవన్‌లో జరగనున్న ఇండియన్ స్టూడెంట్స్ పార్లమెంట్ సదస్సులో పాల్గొంటారు. ఈ కార్యక్రమాన్ని కేంద్ర మానవవనరుల శాఖ నిర్వహిస్తుంది. దేశానికి స్వచ్ఛమైన యువ రాజకీయ నాయకత్వాన్ని అందించడానికి ఉద్దేశించిన ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పవన్ కళ్యాణ్ హాజరై ఉపన్యాసిస్తారు. అలాగే ఈ కార్యక్రమ సందర్భంగా పవన్ కళ్యాణ్ గురించి చిత్రీకరించిన ఒక షార్ట్‌ ఫిలింను కూడా ప్రదర్శించనున్నారు. ఈ సదస్సుకు మేఘాలయ అసెంబ్లీ స్పీకర్ మెత్బా లింగ్లో అధ్యక్షత వహిస్తారు. కేంద్ర మంత్రి స్మృతి ఇరానీ, కాంగ్రెస్ నేత జ్యోతిరాదిత్య సింధియా, తదితరులు ఈ సదస్సుకు హాజరై ప్రసంగించనున్నారు.

[subscribe]

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

1 + twelve =