తెలంగాణ రాష్ట్రంలోని విశ్వవిద్యాలయాల వైస్ చాన్సలర్ల నియామకంపై ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు కీలక నిర్ణయం తీసుకున్నారు. వివిధ విశ్వవిద్యాలయాల వైస్ చాన్సలర్ల నియామక ప్రక్రియను వేగవంతం చేయాలని చెప్పారు. వీసీ నియామక ప్రక్రియ పూర్వరంగంలో, సెర్చ్ కమిటీ నుండి పేర్లు తెప్పించుకుని ముందుగా ఎగ్జిక్యూటివ్ కౌన్సిల్ మెంబర్ల నియామకాలు సత్వరంగా పూర్తి చేయాలని సీఎం కేసీఆర్ సంబంధిత అధికారులను ఆదేశించారు. ఈ పక్రియ వలన వీసీల నియామాకానికి మార్గం సుగమం అవుతుందని సీఎం కేసీఆర్ అన్నారు. రాబోయే రెండు-మూడు వారాల్లోగా ఇదంతా జరగాలని సీఎం కేసీఆర్ స్పష్టమైన ఆదేశాలు ఇచ్చారు.
[subscribe]