కరోనా వ్యాప్తి నియంత్రణకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం చేపడుతున్న కార్యక్రమాలకు తమ వంతు సాయంగా పలుసంస్థలు విరాళాలు అందిస్తున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో కరోనా కట్టడి చర్యలకు మద్ధతుగా తాజాగా కియా మోటర్స్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ భారీ విరాళం అందించింది. ఏపీ విపత్తు నిర్వహణ సంస్ధకి (ఏపీఎస్డిఎంఏ) కియా మోటర్స్ రూ.5 కోట్ల విరాళాన్ని అందించింది. ఈ మేరకు కియా ఇండియా ఎండీ, సీఈవో కుక్ హ్యున్ షిమ్ బుధవారం నాడు ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డిని కలిసి విరాళానికి సంబంధించిన పత్రాలను అందజేశారు. ఈ విరాళాన్ని ఆక్సిజన్ కాన్సంట్రేటర్స్, వెంటిలేటర్లు, క్రయోజనిక్ ట్యాంకర్లు సహా ఇతర వైద్య పరికరాలు కొనుగోలుకు ఉపయోగించాలని వారు విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో మంత్రులు బుగ్గన రాజేంద్రనాథ్రెడ్డి, మేకపాటి గౌతమ్రెడ్డి, కియా మోటర్స్ సంస్థ ప్రతినిధులు పాల్గొన్నారు.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ