జనసేనాని మద్ధతు కోరిన కిషన్ రెడ్డి.. పొత్తు పొడుస్తుందా?

Kishan Reddy asked Jana Sena for help Will the alliance work,Kishan Reddy asked Jana Sena,Will the alliance work,Jana Sena for help,Mango News,Mango News Telugu,Telangana BJP leaders discuss possible alliance,Telangana polls,Telangana BJP Reaches Out,BJP may ally for Telangana polls,Telangana BJP President Kishan Reddy, bjp, Janasena, Janasena Pawan Kalyan, Kishan Reddy, pawan kalyan, Telangana Assembly Elections,Janasena Pawan Kalyan Latest News,Janasena Pawan Kalyan Latest Updates,Kishan Reddy Latest News and Updates
janasena pawan kalyan, pawan kalyan, janasena, bjp, kishan reddy, telangana assembly elections

రెండు తెలుగు రాష్ట్రాల్లో పొలిటికల్ హీట్ పెంచుతున్నారు జనసేనాని పవన్ కల్యాణ్. ఏపీలో టీడీపీతో కలిసి ఎన్నికలకు వెళ్తామన్న పవన్.. ఇటు తెలంగాణలో కూడా పోటీ చేస్తామని ప్రకటించారు. మొత్తం 32 స్థానాల్లో పోటీ చేస్తామని.. ఆయా నియోజక వర్గాల పేర్లను కూడా వెల్లడించారు. కొందరు ఆశావాహులు కూడా జనసేన తరుపున పోటీ చేసేందుకు ఉత్సాహం చూపిస్తున్నారు. ఈసారి ఎలాగైనా పోటీ చేసి సత్తా చాటాలని తెలంగాణ జనసైనికులు ఉవ్విళ్లూరుతున్నారు.

సరిగ్గా ఈ సమయంలో కీలక పరిణామం చోటుచేసుకుంది. తెలంగాణ బీజేపీ చీఫ్ కిషన్ రెడ్డి, ఎంపీ లక్ష్మణ్‌లు పవన్ కల్యాణ్‌తో సమావేశమయ్యారు. తెలంగాణ ఎన్నికల్లో పోటీ చేయకుండా.. తమకు మద్ధతు ఇవ్వాలని కోరారు. అయితే మద్ధతు ఇవ్వమనే కాకుండా.. పూర్తిగా ఎన్నికల నుంచి తప్పుకోవాలని కోరడంతో జనసైనికులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. గతంలో కూడా జీహెచ్ఎంసీ ఎన్నికల్లో జనసేన పోటీకి దిగింది. కానీ చివరి నిమిషంలో బీజేపీ మాట విని ఎన్నికల నుంచి తప్పుకుంది. దీంతో జనసేన నేతలు అప్పుడు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. ఇప్పుడు కూడా అదే సీన్ రిపీట్ అవుతుందా? అని జనసైనికులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు.

ఈ పరిణామాల మధ్య జనసేనానిపై తీవ్ర ఒత్తిడి పెరుగుతోందట. ఓవైపు తెలంగాణ జనసే నేతలు ఎట్టి పరిస్థితిలోనూ పోటీ చేయాల్సిందేనని పట్టుపట్టుకొని కూర్చుకున్నారు. ఈసారి కూడా పోటీ చేయకపోతే..పార్టీ ఎదగడం కష్టమని అంటున్నారు. జీహెచ్ఎంసీ ఎన్నికల్లో తప్పుకోవడంపైనే గుర్రుగా ఉన్నారు. అటు బీజేపీ.. మొత్తానికి ఎన్నికల నుంచి తప్పుకొని మద్ధతు ఇవ్వాలని కోరుతోంది. దీంతో పవన్ కల్యాణ్‌కు పెద్ద చిక్కొచ్చి పడింది. అటు బీజేపీ వైపు మొగ్గు చూపాలా?.. జనసైనికుల వైపు మొగ్గు చూపాలా? అని తల పట్టుకొని కూర్చున్నారట పవన్ కల్యాణ్. ఏది ఏమైనప్పటికీ చివరికి జనసేనాని ఏ నిర్ణయం తీసుకుంటారనేది హాట్ టాపిక్‌గా మారింది.

మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

nine + 9 =