ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం పదో తరగతి పరీక్షల నిర్వహణకు ఇప్పటికే షెడ్యూల్ ను ప్రకటించిన సంగతి తెలిసిందే. ఇప్పటివరకు పదో తరగతిలో 11 పేపర్లతో పరీక్షలు నిర్వహిస్తుండగా, ఇప్పుడు 6 పేపర్లకు కుదించి జూలై 10 వ తేదీ నుంచి పరీక్షలను నిర్వహించనున్నారు. ఈ నేపథ్యంలో రాష్ట్రంలో పదో తరగతి పరీక్షలను ముందుగా ప్రకటించిన షెడ్యూల్ ప్రకారమే నిర్వహించనున్నట్టు ఏపీ విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేష్ ఈ రోజు వెల్లడించారు.
జూలై 10 నుంచి యధాతధంగా పరీక్షలు నిర్వహిస్తామని చెప్పారు. కరోనా వ్యాప్తి నేపథ్యంలో దేశంలో పలు రాష్ట్రాలుతో పాటుగా తెలంగాణ, తమిళనాడు రాష్ట్రాలు కూడా ఇప్పటికే పదో తరగతి పరీక్షలను రద్దు చేశాయి. కాగా విద్యార్థులు, పరీక్షా నిర్వహణ సిబ్బంది ఆరోగ్య విషయంలో తగు జాగ్రత్తలు తీసుకుని పరీక్షల నిర్వహణకే ఏపీ ప్రభుత్వం ఏర్పాట్లు చేస్తుంది.
మ్యాంగో న్యూస్ యాప్ లింక్స్:
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJu