మాజీ కారు డ్రైవర్ సుబ్రహ్మణ్యం హత్య కేసులో అధికార వైఎస్సార్సీపీ ఎమ్మెల్సీ అనంత ఉదయ భాస్కర్ (అనంతబాబు) ప్రధాన నిందితుడిగా ఉండడంతో అరెస్టై, ప్రస్తుతం జైలులో రిమాండ్ లో ఉన్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ఎమ్మెల్సీ అనంతబాబు విషయంలో వైఎస్సార్సీపీ కీలక నిర్ణయం తీసుకుంది. హత్య కేసులో ప్రధాన నిందితుడిగా ఉన్న అనంతబాబును పార్టీ నుంచి సస్పెండ్ చేస్తున్నట్టు ప్రకటించారు. ఈ మేరకు పార్టీ కేంద్ర కార్యాలయం బుధవారం రాత్రి ఒక ప్రకటన విడుదల చేసింది.
“పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ఆదేశాల మేరకు, తన మాజీ డ్రైవర్ సుబ్రహ్మణ్యం మరణానికి తానే బాధ్యుడిని అని ఎమ్మెల్సీ అనంతబాబు తమకు వాంగ్మూలం ఇచ్చినట్లు పోలీసులు ప్రకటించిన నేపథ్యంలో ఆయనను పార్టీ నుంచి సస్పెండ్ చేయడమైనది” అని వైఎస్సార్సీపీ పార్టీ కేంద్ర కార్యాలయం ప్రకటనలో వెల్లడించింది.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYF