మొద్దు శీను హత్యకేసులో నిందితుడు ఓం ప్రకాశ్‌ మృతి

AP News, AP Political Updates, Moddu Seenu, Moddu Seenu Case, Moddu Seenu Murder, Moddu Seenu Murder Case, Moddu Seenu Murder Case Accused, Moddu Seenu Murder Case Accused Died, Moddu Seenu Murder Case Accused Om Prakash Died

గతంలో సంచలనం సృష్టించిన మొద్దు శీను హత్యకేసులో నిందితుడైన ఓం ప్రకాశ్ జూలై 27, సోమవారం నాడు‌ మృతి చెందాడు. గత కొంతకాలంగా ఆయన కిడ్నీ సంబంధిత అనారోగ్యంతో బాధపడుతున్నారు. చికిత్స నిమిత్తం విశాఖ సెంట్రల్ జైలులో శిక్ష అనుభవిస్తున్న అతన్ని శనివారం రాత్రి కేజీహెచ్‌ ఆసుపత్రికి తరలించారు. చికిత్స పొందుతూ సోమవారం మృతి చెందినట్లు జైలు సూపరింటెండెంట్‌ తెలిపారు. 2008లో ఒక కేసులో శిక్షకు గురై అనంతపురం జిల్లా జైలులో ఓం ప్రకాశ్‌ కొంత కాలం ఉన్నాడు. ఆ సమయంలో టీడీపీ నాయకుడు పరిటాల రవి హత్య కేసులో ప్రధాన నిందితుడైన మొద్దు శీనును అదే జైలులో డంబెల్ తో తలపై కొట్టి చంపాడు. ఈ నేరంలో అనంతపురం ఫాస్ట్ ట్రాక్ కోర్టు ఓంప్రకాశ్‌కు జీవిత ఖైదు విధించడంతో జైలులో శిక్ష అనుభవిస్తున్నాడు.

మ్యాంగో న్యూస్ యాప్ లింక్స్:

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJu

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

eighteen − 1 =