విశాఖపట్నంకు త్వరలోనే ఎగ్జిక్యూటివ్ రాజధాని వస్తుందని వైఎస్సార్సీపీ కీలక నేత, రాజ్యసభ ఎంపీ విజయసాయి రెడ్డి తెలిపారు. బుధవారం ఆయన విశాఖలో మీడియాతో మాట్లాడుతూ, సీఆర్డీఏ కేసుకు, రాజధాని తరలింపునకు ఎలాంటి సంబంధం లేదని చెప్పారు. సీఎం ఎక్కడినుంచైనా పరిపాలన కొనసాగించవచ్చని అన్నారు. ఎగ్జిక్యూటివ్ రాజధానిని విశాఖకు తరలించేందుకు ఏర్పాట్లు జరుగుతాయని, అతి త్వరలోనే తరలించడం జరుగుతుందని విజయసాయిరెడ్డి పేర్కొన్నారు. అయితే తేదీ మాత్రం అడగొద్దని ఆయన విజ్ఞప్తి చేశారు.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ