ఏపీ సీఎస్ నీలం సాహ్ని పదవీ కాలం డిసెంబర్ నెలాఖరు వరకు పొడిగింపు

Andhra Pradesh, AP CS Neelam Sahni, AP Government, AP Govt, AP Govt has Extended CS Neelam Sahni, AP Govt has Extended CS Neelam Sahni Tenure, AP News, CS Neelam Sahni

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నీలం సాహ్ని పదవీ కాలాన్ని డిసెంబర్ 31, 2020 వరకు పొడిగిస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఆగస్టు 7, శుక్రవారం నాడు ఉత్తర్వులు జారీ చేసింది. ముందుగా సీఎస్ నీలం సాహ్ని జూన్ నెలలో పదవీ విరమణ చేయాల్సిన ఉండగా, ఆమె పదవీ కాలాన్ని ప్రభుత్వం మొదట మూడు నెలల పాటుగా సెప్టెంబరు 30 వరకు పొడిగిస్తూ ఉత్తర్వులు జారీ ఇచ్చింది. తాజాగా మరో మూడు నెలల పాటుగా సీఎస్ పదవీకాలాన్ని ప్రభుత్వం పొడిగించింది. సీఎస్ పదవి కాలం పొడిగింపుకు సంబంధించి ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ‌మోహన్‌ రెడ్డి, ప్రధాని నరేంద్ర మోదీకి లేఖ రాశారు. లేఖకు స్పందిస్తూ కేంద్రం ఆమోదం తెలిపిన అనంతరం సీఎస్ పదవి కాలంపై రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులను విడుదల చేసింది.

మ్యాంగో న్యూస్ యాప్ లింక్స్:

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJu

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

3 × 2 =