మాజీ ఎంపీ, కాపు ఉద్యమ నేత ముద్రగడ పద్మనాభం సంచలన నిర్ణయం తీసుకున్నారు. ఇకపై కాపు ఉద్యమం నుంచి తప్పుకోవాలని నిర్ణయించుకున్నట్లు ఈ రోజు ఆయన ప్రకటించారు. ఈ మేరకు రెండు పేజీల లేఖను విడుదల చేశారు. ఈ మధ్య మానసికంగా కృంగిపోయే విధంగా సోషల్ మీడియా, ఎలక్ట్రానిక్ మీడియా ద్వారా కొంతమంది దాడులు చేయిస్తున్నారని ఆయన అన్నారు. ఆరోజు ఉద్యమంలోకి రావడానికి కారణం చంద్రబాబునాయుడని, కాపు జాతికి బీసీ రిజర్వేషన్ ఇస్తాను అని ఇచ్చిన హామీ కోసమే వచ్చానని చెప్పారు. ఈ ఉద్యమం ద్వారా డబ్బు గాని, పదవులు గాని పొందాలని ఏనాడూ అనుకోలేదని తెలిపారు. ఉద్యమం ద్వారా ఏమి సాధించలేదని విమర్శలు చేసేవాళ్లు డ్రైవర్ సీటులో కూర్చుని, కాపు జాతికి బీసీ రిజర్వేషన్లు వచ్చే ఏర్పాటు చేయమని కోరుకుంటున్నానని లేఖలో ముద్రగడ పద్మనాభం పేర్కొన్నారు.
మ్యాంగో న్యూస్ యాప్ లింక్స్:
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJu