రాష్ట్రంలో ఆక్వా రంగాన్ని సంక్షోభం నుంచి గట్టెక్కించాలని ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డికి టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ లేఖ లేశారు. ఈ మేరకు ఆయన లేఖను జత చేస్తూ ట్వీట్ చేశారు. “వైసీపీ ప్రభుత్వం చూపిన నిర్లక్ష్య వైఖరి కారణంగానే ఆక్వా రంగం సంక్షోభంలో కూరుకుపోయింది. ఇప్పటికైనా కళ్లుతెరిచి ఆక్వా రైతుల డిమాండ్లన్నీ తక్షణమే నెరవేర్చకపోతే పరిశ్రమలు, వ్యవసాయరంగం దారిలోనే ఆక్వా హాలీడే కూడా తప్పకపోవచ్చు. ఆక్వా జోన్, నాన్ ఆక్వా జోన్ తో సంబంధం లేకుండా విద్యుత్ యూనిట్కి రూ.1.50నే కొనసాగించాలి” నారా లోకేష్ సూచించారు.
“క్వాలిటీ సీడ్ సరఫరా చేయాలి. విపరీతంగా పెంచిన ఫీడ్ ధరలు తగ్గించాలి. కనీసం 15 రోజులపాటు రొయ్యల రేటు పడిపోకుండా నిలకడగా వుండేలా చూడాలి. పెంచిన అగ్రికల్చర్ మార్కెట్ కమిటీ సెస్ ని తగ్గించాలి ధరలు పడిపోతే ప్రభుత్వం నుంచి మద్దతు అందించాలి. ఈ ప్రోత్సాహాకాలు ప్రభుత్వం నుంచి ఆక్వా రంగానికి అందకపోతే, కోట్లాది రూపాయల ఆదాయం తెచ్చిపెట్టే పరిశ్రమ కూడా హాలీడే తప్పకపోవచ్చు. దయచేసి మీరు ఆక్వారంగం సంక్షోభంలో పడకుండా చర్యలు తీసుకోవాలని కోరుతున్నాను” అని నారా లోకేష్ పేర్కొన్నారు.
సంక్షోభం నుంచి ఆక్వా రంగాన్ని గట్టెక్కించాలని సీఎం జగన్ మోహన్ రెడ్డి గారికి లేఖ రాశాను.
వైసిపి ప్రభుత్వం చూపిన నిర్లక్ష్య వైఖరి కారణంగానే ఆక్వా రంగం సంక్షోభంలో కూరుకుపోయింది.(1/4) pic.twitter.com/8mQBmZonCz— Lokesh Nara (@naralokesh) June 16, 2022
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEY