బాసర ట్రిపుల్ ఐటీ వద్ద గడచిన 3 రోజులుగా వేలాదిమంది విద్యార్థులు తమ సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ నిరసనలను తెలుపుతున్న నేపథ్యంలో తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. బాసర ట్రిపుల్ ఐటీకి నూతన డైరెక్టర్గా ప్రొఫెసర్ సతీష్ కుమార్ ను నియమిస్తూ ప్రభుత్వం ఈ మేరకు గురువారం ఉత్తర్వులు జారీ చేసింది. అయితే డైరెక్టర్ నియామకంపై హర్షం వ్యక్తం చేసిన విద్యార్థులు తమ ఆందోళన మాత్రం కొనసాగుతుందని స్పష్టం చేశారు. వీసీ వల్లనే ఏం కాలేదు, డైరెక్టర్ వచ్చి ఏం చేస్తారంటూ ప్రశ్నించారు. వీరి నిరసనల మధ్యే ట్రిపుల్ ఐటీ నూతన డైరెక్టర్గా ప్రొఫెసర్ సతీష్ కుమార్ నియామకం జరిగింది. విద్యార్థులు మాత్రం తమ డిమాండ్ల విషయంలో వెనక్కి తగ్గేది లేదని, ప్రభుత్వం స్పష్టమైన హామీ ఇస్తేనే ఆందోళన విరమిస్తామని విద్యార్థులు తేల్చి చెప్పారు. తప్పనిసరిగా సీఎం కేసీఆర్ కానీ, మంత్రి కేటీఆర్ కానీ రావాల్సిందేనంటూ పట్టుబడుతున్నారు.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ