నర్సాపురం ఎంపీ రఘురామకృష్ణరాజును ఏపీ సీఐడీ శుక్రవారం నాడు అరెస్ట్ చేసింది. ఆయనను హైదరాబాద్ లో అదుపులోకి తీసుకున్నారు. ఆయనపై 124ఏ, 153 బి, 505 ఐపీసీ, 120 బి సెక్షన్ల కింద కేసు నమోదు చేసినట్టు తెలిపారు. ఈ మేరకు రఘురామకృష్ణరాజు కుటుంబసభ్యులకు నోటీసులు అందజేశారు. రఘురామకృష్ణరాజును మంగళగిరిలోని సీఐడీ కార్యాలయానికి తరలిస్తున్నట్టు తెలుస్తుంది.
మరోవైపు పుట్టిన రోజు నాడే అకారణంగా తన తండ్రిని అరెస్టు చేశారని రఘురామకృష్ణరాజు కుమారుడు భరత్ ఆరోపించారు. ఆయనకు 4 నెలల క్రితమే బైపాస్ సర్జరీ జరిగిందన్నారు. 30మంది పోలీసులు అకస్మాత్తుగా వచ్చి ఆయన్ను బలవంతంగా లాక్కుని వెళ్లిపోయారని, ఎక్కడికి తీసుకు వెళ్లారో తెలీదని భరత్ పేర్కొన్నారు.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ