వైసీపీ కంచుకోటల్లో ఒకటి నెల్లూరు. గత ఎన్నికల్లో ఆ జిల్లాలో వైసీపీ అదరగొట్టింది. మొత్తం 10 నియోజకవర్గాలు ఉండగా అన్ని స్థానాలను క్లీన్ స్వీప్ చేసింది. ప్రస్తుతం నెల్లూరు ఎంపీగా ఆదాల ప్రభాకర్ రెడ్డి.. నెల్లూరు సిటీ ఎమ్మెల్యేగా అనిల్ కుమార్ యాదవ్ ప్రాతినిథ్యం వహిస్తున్నారు. అయితే వచ్చే ఎన్నికల్లో అనిల్ కుమార్ యాదవ్ లోక్ సభ రేసులోకి దిగుతున్నారు. నరసరావుపేట నుంచి వైసీపీ తరుపున ఎంపీగా పోటీ చేస్తున్నారు. మరోవైపు ఆదాల ప్రభాకర్ రెడ్డిని వైసీపీ అసెంబ్లీ ఎన్నికల బరిలోకి దింపుతోంది. నెల్లూరు రూరల్ నుంచి ఆయన అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేస్తున్నారు.
ప్రభాకర్ రెడ్డి అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేస్తుండడంతో.. నెల్లూరు ఎంపీ స్థానా ఖాళీ అయింది. అయితే మొదట ఆ స్థానం నుంచి రాజ్యసభ ఎంపీగావున్న వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డిని పోటీ చేయించాలని జగన్ అనుకున్నారు. ఆయన్ను పోటీ చేయించేందుకు అంతా సిద్ధమవుతున్న సమయంలో వేమిరెడ్డి ట్విస్ట్ ఇచ్చారు. నెల్లూరు పార్లమెంట్ పరిధిలోని అసెంబ్లీ స్థానల్లో తాను చెప్పిన వారికి టికెట్ ఇవ్వాలని కండీషన్ పెట్టారు. నెల్లూరు సిటీ టికెట్ తన భార్యకు.. కందుకూరు టికెట్ తన అనుచరుడికి ఇవ్వాలనని వైసీపీ హైకమాండ్ను వేమిరెడ్డి కోరారు.
కానీ వేమిరెడ్డి కోరినట్లుగా జగన్ ఆయా టికెట్లు ఇవ్వలేదు. నెల్లూరు సిటీ టికెట్ డిప్యూటీ మేయర్ ఖలీల్కు ఇచ్చారు. ఈక్రమంలో అలకబూనిన వేమిరెడ్డి అప్పటి నుంచి హైకమాండ్కు దూరంగా ఉంటున్నారు. అంతేకాకుండా పార్టీకి, నేతలకు అందుబాటులో లేకుండా అజ్ఞాతంలోకి వెళ్లిపోయారట. ఆయన సంప్రదించేందుకు వైసీపీ పెద్దలు ప్రయత్నించినప్పటికీ.. ఆయన అందుబాటులోకి రాలేదట. దీంతో నెల్లూరు నుంచి ఎంపీగా వేరే వారిని బరిలోకి దించాలని జగన్ ఆలోచిస్తున్నారట.
ఈక్రమంలో పలువురి పేర్లను పరిశీలించిన జగన్.. చివరికి ఒకరిని ఖరారు చేసినట్లు తెలుస్తోంది. వైసీపీ ముఖ్యనేత విజయసాయిరెడ్డి అల్లుడి అన్న అయిన శరత్ చంద్రారెడ్డిని నెల్లూరు నుంచి ఎంపీగా పోటీ చేయించాలని జగన్ అనుకుంటున్నారట. సర్వేలు ఫలితాలు కూడా శరత్కు అనుకూలంగా వచ్చాయట. ఈక్రమంలో శరత్ చంద్రారెడ్డిని నెల్లూరు ఎంపీ అభ్యర్థిగా దాదాపు ఖరారు చేసినట్లేనని.. అధికారికంగా ప్రకటించడమే ఆలస్యమని ప్రచారం జరుగుతోంది.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xE