ఆంధ్రప్రదేశ్ లో1,28,589 ఉద్యోగాలకు నోటిఫికేషన్ విడుదల

1, 28, 589 Notification issued for ward secretary jobs in AP, Andhra Pradesh Political News, AP Village Secretariat Recruitment 2019, AP Ward Sachivalayam Secretary Notification 2019, Mango News, Notification for AP Grama Sachivalayam recruitment released, Notification Released For Village And Ward Secretary Jobs In AP

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం శుక్రవారం నాడు గ్రామా సచివాలయాలు, వార్డు సచివాలయాలకు విడివిడిగా నోటిఫికేషన్స్ విడుదల చేసింది. సచివాలయాలకు సంబంధించి అన్ని విభాగాలకు మొత్తం 1,28,589 పోస్టుల నియామకాలు చేపట్టనున్నారు. ముఖ్యంగా గ్రామసచివాలయాల్లో 13 విభాగాలకు 95,088 పోస్టులు కేటాయించారు. పట్టణ ప్రాంతాల్లో వార్డు సచివాలయాలకు సంబంధించి,9 విభాగాలకు 33,501 పోస్టులు భర్తీ చేస్తారు. ఇటీవలే రాష్ట్రంలో కొత్తగా 11,114 గ్రామ సచివాలయాలు మరియు 3,786 వార్డు సచివాలయాలు ఏర్పాటు చేస్తున్నట్టు ప్రకటించిన సంగతి తెలిసిందే.

దరఖాస్తుల స్వీకరణ జూలై 27 నుండి మొదలయ్యి, తుదిగడువు ఆగస్ట్ 8 తేదీతో పూర్తవుతుంది. ఈ నియామకాలన్నీ జిల్లా ఎంపిక కమిటీ (డీఎస్సి) ద్వారా చేపట్టనున్నారు. ఈ నోటిఫికేషన్ ద్వారా ఎంపికైన ఉద్యోగులు అక్టోబర్ 2నుంచి విధుల్లో చేరతారు, మరియు రెండు సంవత్సరాల పాటు ప్రొబేషనరీ పిరియడ్ లో ఉంటారు. ప్రొబేషనరీ పిరియడ్ కాలంలో నెలకు 15 వేల రూపాయలు వేతనంగా చెల్లిస్తారు, ఆ తర్వాత శాశ్వత ఉద్యోగ నిబంధనలనుసారంగా జీతం చెల్లిస్తారు. gramasachivalayam.ap.gov.in, vsws.ap.gov.in, wardsachivalayam.ap.gov.in వెబ్ సైట్స్ లో దరఖాస్తు చేసుకోవచ్చు.

 

[subscribe]
[youtube_video videoid=DnpxkM1i5CM]

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

6 + 3 =