50 శాతం రిజర్వేషన్లపై ఉత్తర్వులు జారీచేసిన ఏపీ ప్రభుత్వం

AP Govt Issued Notification For Fifty Percent Reservation In Nominated Posts,Mango News,AP Breaking News Today,AP Govt Fifty Percent Reservation In Nominated Posts,AP Govt 50% Reservation,AP Nominated Posts,Andhra Pradesh Government Latest Notification

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి గతంలో ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలకు నామినేటెడ్ పోస్టుల్లో 50 శాతం రిజర్వేషన్లు కల్పించాలని నిర్ణయం తీసుకుని అసెంబ్లీలో చర్చించిన సంగతి తెలిసిందే. ఆ మేరకు రిజర్వేషన్స్ అమలుకు విధి విధానాలు రూపొందించి తాజాగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నోటిఫికేషన్ ను జారీ చేసింది. ప్రకటించిన 50 శాతం రిజర్వేషన్స్ లో బీసీ, మైనార్టీలకు 29 శాతం చొప్పున, ఎస్సీలకు 15 శాతం, ఎస్టీలకు 6 శాతం పదవులను కేటాయిస్తూ ఉత్తర్వులు జారీచేసారు. అదే విధంగా ఈ 50 శాతం రిజర్వేషన్స్ లో మహిళలకు 50 శాతం పదవులు కేటాయించారు. ఏపీ ప్రభుత్వం ఆధ్వర్యంలోని అన్ని విభాగాలకు సంబంధించిన నామినేటెడ్ పదవుల్లో ఈ రిజర్వేషన్స్ అమలు అయ్యేలా చర్యలు తీసుకోవాలని ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది.

[subscribe]

 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

nine + one =