జనసేన పార్టీ అధ్యక్షుడు పవన్ కల్యాణ్ జూలై 26 న నలుగురు సభ్యులతో పొలిట్ బ్యూరో, 11 మంది సభ్యులతో పొలిటికల్ అఫైర్స్ కమిటీని ఏర్పాటు చేసారు. దీని తరువాత ఈ నెల 29 నుంచి పార్టీ కమిటీలు, నాయకులు, పార్లమెంటరీ నియోజక వర్గాల వారీగా సమావేశాలు నిర్వహించాలని నిర్ణయించారు. ఈ సమావేశాలు విజయవాడ మరియు మంగళగిరిలోని పార్టీ కార్యాలయాల్లో జరుగుతాయి. పార్టీ నిర్మాణం పై క్రియాశీలక కార్యకర్తలు, ముఖ్య నేతలతో చర్చలు జరుపనున్నారు, పార్టీని బలోపేతం చేయడానికి చేపట్టబోయే కార్యక్రమాలకు సంబంధించి నాయకులతో ముఖాముఖీ చర్చలు జరుపుతారు.
జూలై 29, సోమవారం ఉదయం 11 గంటల నుండి పార్టీ ముఖ్యనాయకులు, వివిధ కమిటీ సభ్యులతో పవన్ కల్యాణ్ సమావేశమవుతారు. అదే రోజు సాయంత్రం 4 గంటలకు పార్టీ పొలిటికల్ అఫైర్స్ కమిటీ సమావేశం విజయవాడలోని పార్టీ రాష్ట్ర కార్యాలయంలో జరగనుంది. జూలై 30, 31 వ తేదీల్లో నరసాపురం పార్లమెంటరీ నియోజకవర్గం, కాకినాడ పార్లమెంటరీ నియోజకవర్గం, రాజమహేంద్రవరం పార్లమెంటరీ నియోజకవర్గ సమావేశాలు మంగళగిరిలోని పార్టీ కార్యాలయంలో నిర్వహించనున్నారు.
[subscribe]
[youtube_video videoid=OkVd-3NgisQ]