ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని పలుజిల్లాల్లో నివర్ తుపాన్ ప్రభావం చూపిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో పంటలు కోల్పోయి తీవ్రంగా నష్టపోయిన రైతాంగాన్ని పరామర్శించేందుకు జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ ఈ రోజు కృష్ణా, గుంటూరు జిల్లాల్లో పర్యటిస్తున్నారు. ముందుగా గన్నవరం విమానాశ్రయానికి చేరుకున్న ఆయన, అక్కడి నుంచి కంకిపాడు మీదుగా కృష్ణా, గుంటూరు జిల్లాల పర్యటన మొదలుపెట్టారు. ఉయ్యూరు, పామర్రు, చల్లపల్లి, అవనిగడ్డ ప్రాంతాలలో దెబ్బ తిన్న పంట పొలాలను పరిశీలిస్తూ, అక్కడి రైతులను కలిసి వారి బాధలను తెలుసుకుంటున్నారు. ఈరోజు కృష్ణా జిల్లా పర్యటన అనంతరం గుంటూరు జిల్లాలోని భట్టిప్రోలు, చావలి, పెరవలి, తెనాలి, నందివెలుగు, కొలకలూరు ప్రాంతాల్లో పవన్ కళ్యాణ్ పర్యటించనున్నారు. ఈ పర్యటనలో జనసేన కార్యకర్తలు, అభిమానులు పెద్దసంఖ్యలో పాల్గొంటున్నారు.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ