టీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యేల కొనుగోలు కేసు.. మరో ఇద్దరికి ‘సిట్’ నోటీసులు జారీ, నేడు విచారణకు రావాలని ఆదేశం

TRS MLAs Poaching Case SIT Issues Notices To Another Two Suspects Orders To Attend For The Enquiry Today,TRS MLAs purchase case,SIT notices issued to two others, ordered to appear for hearing today,Telangana Sit,Sit Investigation Mla Poaching Case,Trs Mla Poaching Case,Mango News,Mango News Telugu,Telangana Mla Poaching Case,Telangana Mla Poaching Case Latest News And Updates,Telangana Mla Poaching ,Telangana Bjp,Telangana Cm Kcr,Trs Party,Brs Party,Ysrtp,Brs Party Latest News And Updates

తెలంగాణ రాష్ట్ర సమితి (టీఆర్‌ఎస్) ఎమ్మెల్యేల కొనుగోలు కేసులో ప్రత్యేక దర్యాప్తు బృందం (సిట్‌) దూకుడు కొనసాగిస్తోంది. ఈ కేసులో కీలక నిందితులతో సంబంధాలున్నట్లుగా భావిస్తున్న నలుగురికి ఇప్పటికే నోటీసులు జారీ చేయడం తెలిసిన విషయమే. ఇదే క్రమంలో తాజాగా మరో ఇద్దరికి ‘సిట్’ నోటీసులు జారీ చేసింది. మొయినాబాద్ ఫామ్ హౌస్ లో పట్టుబడిన ముగ్గురు నిందితులలో ఒకరైన నందకుమార్‌ భార్య చిత్రలేఖతో పాటు అంబర్‌పేటకు చెందిన న్యాయవాది ప్రతాప్‌ గౌడ్‌కు సమన్లు పంపింది. ఈ కేసులో విచారణ నిమిత్తం సిట్ కార్యాలయం ఎదుట హాజరు కావాల్సిందిగా వారికి ఆదేశాలు జారీ చేసింది.

ఇక ఈ కేసులో కీలక అనుమానితులుగా ఉన్న ఎర్నాకులంలోని అమృత ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్‌లో డాక్టర్ కొట్టిలిల్ నారాయణ్ జగ్గు అలియాస్ జగ్గు స్వామి, బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి (ఆర్గనైజేషన్) బీఎల్ సంతోష్, కేరళకు చెందిన భారత ధార్మిక జన సేన (బీడీజేఎస్) వ్యవస్థాపక అధ్యక్షుడు తుషార్ వెల్లపల్లి తదితరులు సిట్ విచారణకు హాజరు కాకపోవడంతో వారిపై లుకౌట్ నోటీసులు జారీ చేసిన సంగతి తెలిసిందే. దేశవ్యాప్తంగా ఉన్న అన్ని పోలీస్ స్టేషన్ల పరిధిలో వారు ఎక్కడ ఉన్న సమాచారం ఇవ్వాలని, అలాగే దేశం దాటిపోకుండా అన్ని విమానాశ్రయాలు, అంతర్జాతీయ సరిహద్దుల్లోని అధికారులకు ఈ నోటీసులు అందజేశారు.

మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xE

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

20 − six =